IND vs PAK: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్తాన్.. ఎప్పుడు, ఎక్కడంటే?
- మరోసారి దాయాదుల సమరం
- అక్టోబర్ 19న మ్యాచ్
- 2013లో ఆరంభమైన టోర్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Match on October 19 in Men’s T20 Emerging Asia Cup 2024: దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు ఈ ఏడాదిలో మరోసారి తలపడనున్నాయి. జూన్లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో పురుషుల జట్టు తలపడగా.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో మహిళల టీమ్స్ తలపడ్డాయి. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో దాయాది జట్లు మరోసారి ఢీకొట్టనున్నాయి. అక్టోబర్ 19న ఇండియా ఎ, పాకిస్థాన్ ఎ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మస్కట్లోని ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానంలో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024కు సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 18 నుంచి ఒమన్లో ఈ టోర్నీ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 27న జరుగుతుంది. టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎలో శ్రీలంక ఎ, బంగ్లాదేశ్ ఎ, ఆఫ్ఘనిస్తాన్ ఎ, హాంకాంగ్ టీమ్స్ ఉన్నాయి. గ్రూప్-బిలో భారత్ ఎ, పాకిస్థాన్ ఎ, యుఎఇ, ఒమన్ జట్లు ఉన్నాయి. హాంకాంగ్, యూఏఈ, ఒమన్ ప్రధాన జట్లే టోర్నీలో ఆడనున్నాయి.
Also Read
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
Also Read: T20 World Cup 2024: ప్రపంచకప్లో ఇంగ్లండ్కు రెండో విజయం.. మరొక్క గెలుపే!
ఆసియా కప్ 2024 టోర్నీలో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకు.. రెండో మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ఆరంభం అవుతాయి. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. 2013లో ఆరంభమైన ఈ టోర్నీ ఇప్పటి వరకు ఐదుసార్లు జరిగింది. పాకిస్థాన్, శ్రీలంకలు రెండుసార్లు గెలుపొందగా.. భారత్ ఒకసారి విజేతగా నిలిచింది. గత రెండుసార్లు పాక్ విజేతగా నిలిచింది. గతంలో అండర్-23 ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడేవారు. గత ఎడిషన్ నుంచి ఎ జట్ల టోర్నీగా మార్చారు.
తాజావార్తలు
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!