ACB: ఏసీబీ అధికారుల సోదాలు.. కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయటపడేసిన అవినీతి అధికారి
- ఏసీబీ అధికారుల సోదాలు
- కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయటపడేసిన అవినీతి అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలకు సేవా చేయాల్సిన ప్రభుత్వాధికారులు లంచాలకు పడగలెత్తుతున్నారు. కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అవినీతి అధికారులపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో లంచం పుచ్చుకుంటూ పట్టుబడుతున్నారు. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఏసీబీ అధికారులు సోదాలకు వచ్చారన్న విషయం తెలిసి కిటికీలోంచి ఏకంగా రూ. 2 కోట్లను బయటపడేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Balakrishna : అది నా అదృష్టం.. ఎన్టీఆర్ నేషనల్ అవార్డుపై బాలకృష్ణ ఎమోషనల్..
Also Read
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై భువనేశ్వర్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి అంగుల్లోని నివాసం, రాష్ట్రంలోని మరో మూడు ప్రదేశాలతో సహా నాలుగు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. అంగుల్, పూరి, కటక్, దెంకనల్ విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ఈ దాడులను నిర్వహిస్తున్నాయి. చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ షాడంగి ఇంట్లో విజిలెన్స్ బృందం రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అంగుల్లోని అతని ఇంటి నుంచి రూ.90 లక్షలు, రాజధానిలోని అతని నివాసం నుంచి రూ.1.10 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read:Kamal Haasan: ‘‘తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతా’’.. కన్నడ వివాదంపై కమల్ హాసన్..
అంగుల్లోని విజిలెన్స్ ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన సెర్చ్ వారెంట్ ఆధారంగా, ఒడిశా విజిలెన్స్ విభాగం నేతృత్వంలోని ఒడిశా విజిలెన్స్, భువనేశ్వర్, పిపిలి (పూరి)లోని 7 ప్రదేశాలలో 8 మంది డిఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 6 మంది ఎఎస్ఐలు, ఇతర సహాయక సిబ్బందితో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ షాడంగి రెండు రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇంజనీర్ ఇంటిపై దాడి జరిగినప్పుడు, విజిలెన్స్ అధికారులు వచ్చేసరికి సారంగి తన ఫ్లాట్ కిటికీలోంచి నగదు కట్టలను విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ డబ్బును తరువాత సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ओडिशा में इंजीनियर के घर विजिलेंस की टीम ने छापामारी की। जैसे ही इंजीनियर को रेड की जानकारी मिली वह घर की खिड़की से नगदी फेंकने लगा। इंजीनियर के घर से टीम ने 2 करोड़ रुपये जब्त किए हैं।#OdishaNews #BreakingNews pic.twitter.com/MiYWmNYWE0
— Piyush Pandey (@piyush_bebak_) May 30, 2025
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!