ACB: ఏసీబీ అధికారుల సోదాలు.. కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయటపడేసిన అవినీతి అధికారి
- ఏసీబీ అధికారుల సోదాలు
- కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయటపడేసిన అవినీతి అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలకు సేవా చేయాల్సిన ప్రభుత్వాధికారులు లంచాలకు పడగలెత్తుతున్నారు. కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అవినీతి అధికారులపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో లంచం పుచ్చుకుంటూ పట్టుబడుతున్నారు. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఏసీబీ అధికారులు సోదాలకు వచ్చారన్న విషయం తెలిసి కిటికీలోంచి ఏకంగా రూ. 2 కోట్లను బయటపడేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Balakrishna : అది నా అదృష్టం.. ఎన్టీఆర్ నేషనల్ అవార్డుపై బాలకృష్ణ ఎమోషనల్..
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై భువనేశ్వర్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి అంగుల్లోని నివాసం, రాష్ట్రంలోని మరో మూడు ప్రదేశాలతో సహా నాలుగు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. అంగుల్, పూరి, కటక్, దెంకనల్ విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ఈ దాడులను నిర్వహిస్తున్నాయి. చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ షాడంగి ఇంట్లో విజిలెన్స్ బృందం రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అంగుల్లోని అతని ఇంటి నుంచి రూ.90 లక్షలు, రాజధానిలోని అతని నివాసం నుంచి రూ.1.10 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read:Kamal Haasan: ‘‘తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతా’’.. కన్నడ వివాదంపై కమల్ హాసన్..
అంగుల్లోని విజిలెన్స్ ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన సెర్చ్ వారెంట్ ఆధారంగా, ఒడిశా విజిలెన్స్ విభాగం నేతృత్వంలోని ఒడిశా విజిలెన్స్, భువనేశ్వర్, పిపిలి (పూరి)లోని 7 ప్రదేశాలలో 8 మంది డిఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 6 మంది ఎఎస్ఐలు, ఇతర సహాయక సిబ్బందితో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ షాడంగి రెండు రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇంజనీర్ ఇంటిపై దాడి జరిగినప్పుడు, విజిలెన్స్ అధికారులు వచ్చేసరికి సారంగి తన ఫ్లాట్ కిటికీలోంచి నగదు కట్టలను విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ డబ్బును తరువాత సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ओडिशा में इंजीनियर के घर विजिलेंस की टीम ने छापामारी की। जैसे ही इंजीनियर को रेड की जानकारी मिली वह घर की खिड़की से नगदी फेंकने लगा। इंजीनियर के घर से टीम ने 2 करोड़ रुपये जब्त किए हैं।#OdishaNews #BreakingNews pic.twitter.com/MiYWmNYWE0
— Piyush Pandey (@piyush_bebak_) May 30, 2025
తాజావార్తలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..