ACB: ఏసీబీ అధికారుల సోదాలు.. కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయటపడేసిన అవినీతి అధికారి
- ఏసీబీ అధికారుల సోదాలు
- కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయటపడేసిన అవినీతి అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలకు సేవా చేయాల్సిన ప్రభుత్వాధికారులు లంచాలకు పడగలెత్తుతున్నారు. కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అవినీతి అధికారులపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో లంచం పుచ్చుకుంటూ పట్టుబడుతున్నారు. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఏసీబీ అధికారులు సోదాలకు వచ్చారన్న విషయం తెలిసి కిటికీలోంచి ఏకంగా రూ. 2 కోట్లను బయటపడేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Balakrishna : అది నా అదృష్టం.. ఎన్టీఆర్ నేషనల్ అవార్డుపై బాలకృష్ణ ఎమోషనల్..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై భువనేశ్వర్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి అంగుల్లోని నివాసం, రాష్ట్రంలోని మరో మూడు ప్రదేశాలతో సహా నాలుగు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. అంగుల్, పూరి, కటక్, దెంకనల్ విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ఈ దాడులను నిర్వహిస్తున్నాయి. చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ షాడంగి ఇంట్లో విజిలెన్స్ బృందం రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అంగుల్లోని అతని ఇంటి నుంచి రూ.90 లక్షలు, రాజధానిలోని అతని నివాసం నుంచి రూ.1.10 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read:Kamal Haasan: ‘‘తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతా’’.. కన్నడ వివాదంపై కమల్ హాసన్..
అంగుల్లోని విజిలెన్స్ ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన సెర్చ్ వారెంట్ ఆధారంగా, ఒడిశా విజిలెన్స్ విభాగం నేతృత్వంలోని ఒడిశా విజిలెన్స్, భువనేశ్వర్, పిపిలి (పూరి)లోని 7 ప్రదేశాలలో 8 మంది డిఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 6 మంది ఎఎస్ఐలు, ఇతర సహాయక సిబ్బందితో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ షాడంగి రెండు రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇంజనీర్ ఇంటిపై దాడి జరిగినప్పుడు, విజిలెన్స్ అధికారులు వచ్చేసరికి సారంగి తన ఫ్లాట్ కిటికీలోంచి నగదు కట్టలను విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ డబ్బును తరువాత సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ओडिशा में इंजीनियर के घर विजिलेंस की टीम ने छापामारी की। जैसे ही इंजीनियर को रेड की जानकारी मिली वह घर की खिड़की से नगदी फेंकने लगा। इंजीनियर के घर से टीम ने 2 करोड़ रुपये जब्त किए हैं।#OdishaNews #BreakingNews pic.twitter.com/MiYWmNYWE0
— Piyush Pandey (@piyush_bebak_) May 30, 2025
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!