Asia Cup 2024: వరుసగా రెండో విజయం.. సెమీఫైనల్లో భారత్!
- యూఏఈ భారత్ విజయం
- ఆసియా కప్ 2024 సెమీఫైనల్లో భారత్
- బుధవారం ఒమన్తో తలపడనున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్-బిలో భాగంగా సోమవారం యూఏఈతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో వరుసగా రెండు విజయాలతో భారత్ (4 పాయింట్లు) గ్రూప్-బిలో అగ్రస్థానంలో ఉంది. ఒక్కో మ్యాచ్లో గెలిచిన పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ బుధవారం తలపడనున్నాయి. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కు చేరుతుంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ 16.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ అయింది. రాహుల్ చోప్రా (50; 50 బంతుల్లో 2×4, 3×6) ఒంటరి పోరాటం చేశాడు. సిల్ హమీద్ (22), మయాంక్ కుమార్ (10) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. భారత బౌలర్లలో రసిఖ్ సలామ్ (3/15), రమణ్దీప్ సింగ్ (2/7) సత్తాచాటారు. అన్షుల్ కాంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్, నేహాల్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
- రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
- CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
స్వల్ప లక్ష్యాన్ని భారత్ 10.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్ శర్మ (58; 24 బంతుల్లో 6×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ తిలక్ వర్మ (21), ఆయుష్ బదోని (12) కీలక పరుగులు చేశారు. ప్రభసిమ్రాన్ సింగ్ (8), నేహాల్ వధేరా (6) తేలిపోయారు. భారత్ తన తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను ఓడించిన సంగతి తెలిసిందే. భారత్ తన ఆఖరి గ్రూప్ మ్యాచ్లో బుధవారం ఒమన్తో తలపడనుంది. ఒమన్ ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రయించింది. ఇక గ్రూప్-ఎలో శ్రీలంక నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఒక్కో గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్మీ 17C 5G భారత్ లో విడుదలకు రెడీ.. BISలో కనిపించిన బడ్జెట్ ఫోన్, 6000mAh బ్యాటరీ
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
ట్రెండింగ్
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!