ENG vs IND: బీసీసీఐది సరైన నిర్ణయం కాదు: డివిలియర్స్
- మొదటి టెస్ట్లో టీమిండియా ఓటమి
- జులై 2 నుంచి ఎడ్జ్బాస్టన్లో రెండో టెస్ట్
- సిరీస్లో మూడు మ్యాచ్లు మాత్రమే ఆడనున్న బుమ్రా
- బీసీసీఐది సరైన నిర్ణయం కాదన్న డివిలియర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లోని మొదటి టెస్ట్లో టీమిండియా ఓటమిని చవిచూసింది. జులై 2 నుంచి ఎడ్జ్బాస్టన్లో రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడని తెలుస్తోంది. వర్క్లోడ్ నేపథ్యంలో బుమ్రా టెస్ట్ సిరీస్లో మూడు మ్యాచ్లు మాత్రమే ఆడనున్నాడు. తాను అన్ని మ్యాచ్లు ఆడలేనని సిరీస్కు ముందే బుమ్రా చెప్పగా.. అందుకు బీసీసీఐ ఒకే చెప్పింది. బీసీసీఐపై నిర్ణయంపై తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. బీసీసీఐది సరైన నిర్ణయం కాదని అతడు అభిప్రాయపడ్డాడు.
Also Read: Rohit Sharma: ఏవేవో ఆలోచనలు.. కాళ్లు, చేతులు ఆడలేదు!
Also Read
ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… ‘జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అద్భుతమైన బౌలర్. ఇంగ్లండ్లో అతడిని కేవలం మూడు టెస్టుల్లోనే ఆడించడం సరైన నిర్ణయం కాదు. టెస్ట్ క్రికెట్ అత్యున్నతమైనది. అందుకే బుమ్రాను ఈ సిరీస్లోని అన్ని టెస్టుల్లో ఆడించాలి. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా విశ్రాంతి ఇవ్వాలనుకుంటే.. అంతగా ప్రాముఖ్యం లేని టీ20, వన్డేల్లో ఆడించొద్దు. నేను కెప్టెన్గా ఉన్నప్పుడు డేల్ స్టెయిన్ను అలానే ఆడించేవాళ్లం. వర్క్లోడ్ నేపథ్యంలో స్టెయిన్ను ప్రాముఖ్యత లేని టీ20, వన్డే సిరీస్లలో విశ్రాంతి ఇచ్చి.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్తో జరిగే పెద్ద టెస్ట్ సిరీస్లలో ఆడించేవాళ్ళం. భారత్ యాజమాన్యం బుమ్రాకు టెస్ట్ల్లో విశ్రాంతినిస్తోంది. బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడొద్దని వైద్యుడు సూచించి ఉంటాడేమో. అదే నిజమైతే.. దాన్ని మనం గౌరవించాలి’ అని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?