Pakisthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళలు, చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. లాహోర్కు 350 కిలోమీటర్ల దూరంలోని ముజఫర్గఢ్ జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీస్ 1122 ప్రకారం.. ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఢీకొనడంతో చాలా మంది అక్కడికక్కడే మరణించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెస్క్యూ టీమ్, స్థానిక ప్రజలు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్కడ వైద్యులు 11 మంది మరణించినట్లు ప్రకటించారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు.
Read Also: Kaviya Maran: మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు.. బాధలో ఉండొద్దు
Also Read
ఈ ప్రమాదంలో మృతి చెందిన 13 మంది ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. బాధితులు తమ బంధువులను కలిసేందుకు ముల్తాన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన తొమ్మిది మందిలో ముగ్గురి పరిస్థితి చాలా విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
Read Also: Polling: 35 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు..
కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి ట్రక్కు డ్రైవర్పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతనిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ట్రక్కు అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతి వేగంగా నడుపుతుండటంతో కంట్రోల్ చేయలేదని.. దీంతో ట్రక్కు ప్యాసింజర్ వ్యాన్ను ఢీకొట్టిందని ట్రక్కు డ్రైవర్ చెప్పాడు.
తాజావార్తలు
-
UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
-
Mani Ratnam: సెట్స్పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!