UP: బర్త్డే పార్టీకి తీసుకెళ్లి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
- యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు
- బర్త్డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్ఎల్బీ విద్యార్థినిని అత్యాచారం
- అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరింపులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రి.
యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు వెలుగు చూసింది. బర్త్డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్ఎల్బీ విద్యార్థినిని హోటల్కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Alcohol: మద్యం ప్రియులూ.. మందు తాగేటప్పుడు ఈ స్టఫ్ తినండి..శరీరానికి మంచిది
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
సెప్టెంబరు 4న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటానని చెప్పి తన కుమార్తె, స్నేహితుడు ఆదిత్య సింగ్ లా కాలేజీ నుంచి తీసుకెళ్లాడని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు. చరఖారీ బైపాస్లో ఉన్న ఓ హోటల్కి తీసుకెళ్లగా.. అక్కడికి ఆదిత్య స్నేహితుడు సమీర్ కూడా వచ్చాడు. ఆ తర్వాత ఆదిత్య, సమీర్లు తన కూతురిని బెదిరించి అత్యాచారం చేసి అభ్యంతరకరంగా వీడియో తీశారని పోలీసులకు చెప్పాడు. బాధితురాలు స్పృహలోకి రాగానే ఇద్దరూ తన కూతురిని కాలేజీలో వదిలి వెళ్లిపోయారని అన్నాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే వీడియో వైరల్ చేస్తానని బెదిరించారని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు.
Read Also: Pune murder: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. ఏం కట్టుకథ అల్లిందంటే..!
తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగిన తర్వాత తన కుమార్తె కళాశాలకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటుందని అన్నాడు. ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించగా తన బాధను చెప్పిందని.. నిందితులు పంపిన వీడియోను కూడా చూపించిందని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో.. పోలీసులు నిందితులు ఆదిత్య, సమీర్లపై ఎస్సీ-ఎస్టీ చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!