Serial Rapist : ఛీ నీఛుడా… చిన్నపిల్లల రేప్ చేసి శవాలను కూడా వదల్లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial Rapist : సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం చేసి చంపాడో నీచుడు. యూపీ వాసి, సీరియల్ రేపిస్ట్ రవీందర్ కుమార్ను ఢిల్లీలోని రోహిణి కోర్టు దోషిగా నిర్ధారించింది. దాదాపు 30 మంది చిన్నారులపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితుడు కోర్టు ఎదుట అంగీకరించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ నివాసి. అతను ఢిల్లీ-ఎన్సీఆర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డాడు. రవీందర్ కుమార్ రోజుకు 40 కి.మీ నడిచి చిన్నారులపై లైంగిక దాడి చేసి చంపేసేవాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 2008 – 2015 మధ్య అతను దాదాపు 30 మంది పిల్లలను చంపాడు. బాధితుల్లో ఓ చిన్నారి వయస్సు కేవలం రెండేళ్లు కాగా.. అత్యధిక వయస్సు ఉన్న బాధితురాలి వయస్సు పన్నెండేళ్లు. కాగా.. 2008లో 18 ఏళ్ల రవీంద్ర కుమార్ ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ లోని కాస్ గంజ్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. తండ్రి ప్లంబర్.. తల్లి పనిమనిషిగా చేస్తోంది. అతడు కూడా కూలీ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే రవీంద్రకుమార్ డ్రగ్స్ కు బానిసయ్యాడు.
Read Also:Manhole: మ్యాన్హోల్లో దిగి శుభ్రం చేసిన సిబ్బంది.. వరంగల్ మేయర్, కమిషనర్ సీరియస్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
రవీందర్ కుమార్ తన 18 ఏళ్లప్పుడు రెండు అశ్లీల చిత్రాలను చూశాడు. ఆ తరువాత అతడిలోని సీరియల్ రేపిస్ట్, హంతకుడు మేల్కొన్నాడు. అప్పటి నుంచి అతడు అత్యాచారం, హత్యలు చేయడం ఆరంభించాడు. కూలీలు పొద్దంతా పనిచేసి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి తమ మురికివాడల్లో పడుకోగానే తన వేట ప్రారంభించేవాడు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య పిల్లలను రూ.10 నోట్లు లేదా మిఠాయిలతో ప్రలోభపెట్టేవాడు. ఏకాంత భవనం లేదా ఖాళీ మైదానంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. తనను మళ్లీ వారు ఎక్కడ గుర్తిస్తారో అనే భయంతో చాలా మంది పిల్లలను అక్కడే చంపేసేవాడు. 2014లో ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్యాయత్నం, శారీరకంగా వేధించడం వంటి కేసుల్లో ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో అతడిని కోర్టు దోషిగా తేల్చింది. అయితే 24 ఏళ్ల వయసులో 2015లో మొదటి సారిగా అరెస్టయి తీహార్ జైలులో ఉన్నాడు.
Read Also:Terror suspects: హైదరాబాద్ ఉగ్ర కోణం.. వెలుగులోకి కేరళ స్టోరీని మించిన అంశాలు
రవీందర్ కుమార్.. బదౌన్, బాబా హరిదాస్ కాలనీ, బేగంపూర్, కంఝవాలా, హత్రాస్తో సహా ఢిల్లీ-ఎన్సీఆర్లో నేరాలకు పాల్పడ్డాడు. ఔటర్ ఢిల్లీలోని కంఝవాలా, ముండ్కాలో 2011లో రెండు నేరాలు చేసినట్లు రవీందర్ అంగీకరించాడు. 2012లో అలీగఢ్లో జరిగిన వివాహ వేడుకలో తన అత్త దగ్గర ఉన్న సమయంలో బంధువులకు చెందిన 14 ఏళ్ల ఇద్దరు పిల్లలను రేప్ చేసినట్లు అంగీకరించాడు. 2015లో జరిగిన విచారణ సమయంలో అతడు లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపించబడిన 15 స్థలాలను అధికారులకు చూపించాడు.
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!