AP News: నాలుగేళ్లలో విషం పెట్టి 80 ఆవులు, ఎద్దులను చంపిన వ్యక్తి.. ఎందుకంటే?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో దారుణ ఘటన
- నాలుగేళ్లలో విషం పెట్టి 80 ఆవులు, ఎద్దులను చంపిన వ్యక్తి
- సీసీటీవీ ఫుటేజీ ద్వారా పట్టుకున్న గ్రామస్థులు
- పోలీసులకు అప్పగింత
- విచారణలో షాకింగ్ విషయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామంలో అందరినీ కలిచివేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి గత నాలుగేళ్లలో గ్రామంలోని సుమారు 80 పశువులకు విషమిచ్చి చంపేశాడు. అతను నిశ్శబ్దంగా ప్రజల ఇళ్లలోని పశువుల కొట్టంలోకి ప్రవేశించి, ఆవులు, ఎద్దులకు విషం పెట్టి అక్కడి నుంచి పారిపోయే వాడు. గ్రామంలో పశువులకు అంటువ్యాధి వచ్చిందని మొదట్లో ప్రజలు అనుకున్నారు. దీంతో ఆవులు, ఎద్దులు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఓ రైతు ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలో గుర్తుతెలియని రాత్రి సమయంలో పశువుల కొట్టంలో ఓ వ్యక్తి కనిపించడంతో ఈ మొత్తం ఘటన రహస్యం వెలుగులోకి వచ్చింది.
READ MORE: 26/11 Mumbai Attack: ముంబై టెర్రర్ దాడులకు 16 ఏళ్లు.. ఆనాటి హీరోలను గుర్తుచేసుకుందాం..
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
అయితే.. తన పశువుల కొట్టంలోకి ప్రవేశించిన వ్యక్తిని యజమాని బుగ్గన శివరామి రెడ్డి అంతగా పట్టించుకోలేదు. మరుసటి రోజు అతడి ఆవు చనిపోయింది. దీంతో ఆ రైతు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించగా గ్రామానికి చెందిన శంకరాచార్య రహస్యంగా ఆవరణలోకి ప్రవేశించి పశువుల కొట్టానికి వెళ్తున్నట్లు గుర్తించాడు. గత నాలుగేళ్లలో పశువులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో యజమాని శివరామితోపాటు పలువురు రైతులు డోన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శంకరాచార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆవుల మృతికి కారకుడు శంకరాచార్య అని ప్రాథమిక విచారణలో తేలింది. కమలాపురంలోని ఆవులు, ఎద్దులను చంపేందుకు శంకరాచార్యులు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో గత నాలుగేళ్లలో 80 ఆవులు, ఎద్దులను చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఆవులను, ఎద్దులను చంపడానికి గల కారణాన్ని పోలీసులు ఈ వ్యక్తిని అడగగా, సమాధానం విని అందరూ ఆశ్చర్యపోయారు. పశువులను చంపడంతో గ్రామంలో పశువుల కొరత ఏర్పడుతుందని, అప్పుడు ప్రతి ఒక్కరూ తన పశువులను వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తారని ఇలా చేసినట్లు విచారణలో వెల్లడైంది.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!