AP News: నాలుగేళ్లలో విషం పెట్టి 80 ఆవులు, ఎద్దులను చంపిన వ్యక్తి.. ఎందుకంటే?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో దారుణ ఘటన
- నాలుగేళ్లలో విషం పెట్టి 80 ఆవులు, ఎద్దులను చంపిన వ్యక్తి
- సీసీటీవీ ఫుటేజీ ద్వారా పట్టుకున్న గ్రామస్థులు
- పోలీసులకు అప్పగింత
- విచారణలో షాకింగ్ విషయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామంలో అందరినీ కలిచివేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి గత నాలుగేళ్లలో గ్రామంలోని సుమారు 80 పశువులకు విషమిచ్చి చంపేశాడు. అతను నిశ్శబ్దంగా ప్రజల ఇళ్లలోని పశువుల కొట్టంలోకి ప్రవేశించి, ఆవులు, ఎద్దులకు విషం పెట్టి అక్కడి నుంచి పారిపోయే వాడు. గ్రామంలో పశువులకు అంటువ్యాధి వచ్చిందని మొదట్లో ప్రజలు అనుకున్నారు. దీంతో ఆవులు, ఎద్దులు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఓ రైతు ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలో గుర్తుతెలియని రాత్రి సమయంలో పశువుల కొట్టంలో ఓ వ్యక్తి కనిపించడంతో ఈ మొత్తం ఘటన రహస్యం వెలుగులోకి వచ్చింది.
READ MORE: 26/11 Mumbai Attack: ముంబై టెర్రర్ దాడులకు 16 ఏళ్లు.. ఆనాటి హీరోలను గుర్తుచేసుకుందాం..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
అయితే.. తన పశువుల కొట్టంలోకి ప్రవేశించిన వ్యక్తిని యజమాని బుగ్గన శివరామి రెడ్డి అంతగా పట్టించుకోలేదు. మరుసటి రోజు అతడి ఆవు చనిపోయింది. దీంతో ఆ రైతు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించగా గ్రామానికి చెందిన శంకరాచార్య రహస్యంగా ఆవరణలోకి ప్రవేశించి పశువుల కొట్టానికి వెళ్తున్నట్లు గుర్తించాడు. గత నాలుగేళ్లలో పశువులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో యజమాని శివరామితోపాటు పలువురు రైతులు డోన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శంకరాచార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆవుల మృతికి కారకుడు శంకరాచార్య అని ప్రాథమిక విచారణలో తేలింది. కమలాపురంలోని ఆవులు, ఎద్దులను చంపేందుకు శంకరాచార్యులు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో గత నాలుగేళ్లలో 80 ఆవులు, ఎద్దులను చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఆవులను, ఎద్దులను చంపడానికి గల కారణాన్ని పోలీసులు ఈ వ్యక్తిని అడగగా, సమాధానం విని అందరూ ఆశ్చర్యపోయారు. పశువులను చంపడంతో గ్రామంలో పశువుల కొరత ఏర్పడుతుందని, అప్పుడు ప్రతి ఒక్కరూ తన పశువులను వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తారని ఇలా చేసినట్లు విచారణలో వెల్లడైంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!