Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 16 Years Since 26 11 Remembering Heroes Of The Mumbai Terror Attacks

26/11 Mumbai Attack: ముంబై టెర్రర్ దాడులకు 16 ఏళ్లు.. ఆనాటి హీరోలను గుర్తుచేసుకుందాం..

Published Date :November 26, 2024 , 4:34 pm
By Venu Goapl Reddy
  • 26/11 ముంబై దాడులకు 16 ఏళ్లు..
  • 9 మంది ఉగ్రవాదులతో సహా 175 మంది మృతి..
  • ఆనాటి ఘటనలో హీరోలను మరోసారి స్మరించుకుందాం..
26/11 Mumbai Attack: ముంబై టెర్రర్ దాడులకు 16 ఏళ్లు.. ఆనాటి హీరోలను గుర్తుచేసుకుందాం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

26/11 Mumbai Attack: 26/11 ముంబై దాడులను ఈ దేశం ఎప్పుడూ మరిచిపోదు. ఈ దాడి జరిగి నేటికి 16 ఏళ్లు. లష్కరే తోయిబాకు చెందిన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 175 మంది మరణించారు. 166 మంది అమాయకమైన ప్రజలు కాగా, 9 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఒకే ఒక్క టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఇతడిని విచారించగా, పాకిస్తాన్ ప్లాన్ బయటపడింది. ఇండియా న్యాయచట్టాల ప్రకారం, ఇతడికి ఉరిశిక్ష విధించబడింది.

2008లో జరిగిన ఈ ఉగ్రదాడుల్లో 20 మంది భద్రతా బలగాలు, 26 మంది విదేశీయులు మరణించిన వారిలో ఉన్నారు. 300 మందికి పైగా గాయపడ్డారు. సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీతో పాటు కీలక నాయకులు మరణించిన వారికి నివాళులు అర్పించారు.

Also Read

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
  • Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
  • China-Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చైనా ప్రత్యక్ష సహాయం..!
  • Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్‌గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
Add as a preferred
source on google

Read Also: Akkineni : చైతు – శోభితల పెళ్లి వేడుక డిజిటల్ రైట్స్ కు భారీ రేట్..?

ఆనాటి హీరోలు వీరే:

తుకారాం ఓంబ్లే:
26/11 నగరంలో జరిగిన ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ తుకారాం ఓంబ్లే. నవంబర్ 26, 2008 రాత్రి టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు నిరాయుధుడైన ఓబ్లేని కసబ్ చంపాడు. దక్షిణ ముంబైలోని గిర్గామ్ చౌపటీ వద్ద ఇతడిని కాల్చి చంపారు. కసబ్‌ని పట్టుకోవడంలో తుకారం ఓంబ్లే తన ప్రాణాలను పణంగా పెట్టారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్:
2008లో ముంబైలో జరిగిన 26/11 దాడుల సమయంలో మేజర్ సందీప్ పాకిస్తాన్ లష్కరే తోయిబా ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ముంబైలోని తాజ్ ప్యాలెస్ హోటల్ నుండి ఉగ్రవాదులను ఎలిమినేట్ చేసే ఆపరేషన్‌లో ప్రాణ త్యాగం చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్‌జీ) కమాండో టీంకి ఉన్ని కృష్ణన్ నాయకత్వం వహించాడు. ఇతడి త్యాగానికి గుర్తుగా 26 జనవరి 2009న దేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక్ చక్ర లభించింది.

హేమంత్ కర్కరే-అశోక్ కామ్టే-విజయ్ సలాస్కర్:
యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, 1982 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, కామా హాస్పిటల్ సమీపంలో ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో ఆయనతో పాటు మరో ఐపీఎస్ అశోక్ కామ్టే, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలాస్కర్ మరణించారు.

మల్లికా జగద్:
26/11 దాడుల సమయంలో తాజ్ ప్యాలెస్ మేనేజర్‌గా ఉన్న మల్లికా జగద్ ఉగ్రవాదుల్ని అతిధులను రక్షించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు.ఆమె ఒక రూంలో తలుపులు మూసేసి, లైట్లు ఆర్పేసి, అందర్ని నిశ్శబ్ధంగా ఉండాలని కోరారు. అతిధులు అంతా ప్రశాంతంగా ఉండేందుకు మల్లికా సహకరించారు. సైన్యం వచ్చే వరకు ఆమె అందర్ని ప్రశాంతంగా ఉంచింది.

కరంబీర్ సింగ్ కాంగ్:
26/11 దాడుల సమయంలో ముంబైలోని తాజ్ హోటల్ జనరల్ మేనేజర్, కరంబీర్ కాంగ్, అతని భార్య, కుమారులు లోపల చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినప్పుడు వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరిని రక్షించడానికి సిబ్బందికి, భద్రతా బలగాలకు సాయం చేయడానికి అతను పగలు రాత్రి పనిచేస్తూనే ఉన్నారు. వందల మందిని రక్షించారు.

థామస్ వర్గీస్:
తాజ్ వాసబి రెస్టారెంట్ సీనియర్ వెయిటర్ థామస్ వర్గీస్ 26/11 దాడుల్లో నిజమైన హీరోగా నిలిచారు. కాల్పులు ప్రారంభమైన తర్వాత కస్టమర్లను కిందకు వంగి ఉండాలని కోరారు. రెస్టారెంట్ నుంచి అందర్ని సురక్షితంగా పంపించేసి, తానను చివరకుగా రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చే క్రమంలో టెర్రిస్టులు అతడిని చూసి కాల్చి చంపారు. ఎంతో మంది కోసం అతను ప్రాణాలు అర్పించి హీరోగా నిలిచారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 26/11 attacks
  • 26/11 mumbai attack
  • mumbai attack
  • Mumbai terror attack Heroes

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions