Attack In Hospital: ఆసుపత్రిలో ప్రవేశించి విచక్షణారహితంగా దాడి.. ముగ్గురు మృతి.. ఆరుగురుకి గాయలు
- అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని SEPA ఆసుపత్రిలో..
- విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి..
- ముగ్గురు మృతి..
- ఆరుగురుకి గాయలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack In Hospital: రోజురోజుకి దేశంలో దాడుల ఘటనలు ఎక్కువతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని SEPA ఆసుపత్రిలో ఒక వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న వ్యక్తులపై దాడి చేయడంతో కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం ఈ దాడిలో ముగ్గురు మరణించారు. అలాగే మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో దాడి చేసిన వ్యక్తి భార్య, అతని రెండేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన ఆరుగురిలో ఒక పోలీసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Koti Deepotsavam 2024: కార్తీక పూర్ణిమ శుభవేళ.. కోటి దీపోత్సవంలో ఏడవ రోజు కార్యక్రమాలు ఇవే!
Also Read
నికమ్ సాంగ్బియా అనే వ్యక్తి ఉదయం 11.30 గంటలకు సెపా సివిల్ ఆసుపత్రిలోకి ప్రవేశించి విచక్షణారహితంగా ప్రజలపై దాడి చేయడం ప్రారంభించాడని తూర్పు కమెంగ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె సికోమ్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిపై దాడికి పాల్పడిన వ్యక్తి మొదట దాడికి పాల్పడ్డాడని, ఆపై ఇతరులపై దాడి చేయడం ప్రారంభించాడని ఎస్పీ తెలిపారు. హత్యకు గురైన వారిలో దాడి చేసిన వ్యక్తి భార్య తాడే సాంగ్బియా, కుమార్తె నకియా సాంగ్బియా, మరోవ్యక్తి పసా వెలి కూడా ఉన్నారని ఆయన చెప్పారు. దాడి చేసిన వ్యక్తిని ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పోలీసు అధికారి మిన్లీ గయి తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అతనికి మెరుగైన చికిత్స కోసం ఇటానగర్కు తరలించారు. అనంతరం దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!