Cash Transaction: క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇష్టమొచ్చి నట్టు చేస్తున్నారా? వారికి ఆటోమెటిక్గా వివరాలు..
- ఇప్పుడు ఐటీ శాఖ ఒకప్పటిలా లేదు..
- ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితి..
- రూ.10 లక్షలకు మించి చేసిన బ్యాంకులు సదరు వ్యక్తుల వివరాలు ఆటోమెటిక్గా పన్ను శాఖకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cash Transaction: దేశంలోని ప్రజలు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారి ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాలని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఐటీ శాఖ ఒకప్పటిలా లేదు. ప్రజలు చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ గురించి అధికారులకు తెలుసు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితి దేశంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో చట్ట ప్రకారం ఆదాయంపై పన్ను విధించినా.. లేని పక్షంలో పన్నుల శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు వచ్చినప్పుడు రూ.10 కూడా చెల్లించేందుకు యూపీఐని ఉపయోగిస్తున్నాం. అందువల్ల, ప్రతి లావాదేవీ ఒక ఖాతా అని ప్రజలు మరచిపోకూడదు.
Read also: Money In Car Stepney: కారు స్టెప్నీలో రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Also Read
- Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
- Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్పై దాడులు చేయబోమన్న పుతిన్
- BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
- Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
ఇక పన్ను శాఖ ప్రకారం, బ్యాంకులో సంవత్సరానికి రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినా లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి రూ.10 లక్షలకు మించి చేసిన బ్యాంకులు సదరు వ్యక్తుల వివరాలు ఆటోమెటిక్గా పన్ను శాఖకు అందిస్తుంది. వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమలు, ఉపసంహరణలను కూడా పన్ను శాఖ పర్యవేక్షిస్తుంది. కాబట్టి ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు, అది సమస్యలను తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి. పరిమితికి మించి డిపాజిట్లు చేస్తే పన్ను శాఖ నోటీసులు పంపుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే బ్యాంకులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. అదే క్రమంలో, రూ.50,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు పాన్ కార్డ్ వివరాలను అందించాలి. కాబట్టి మీరు చేసే చెల్లింపుల వివరాలు పన్ను అధికారుల దృష్టికి వస్తాయని గుర్తుంచుకోండి.
Read also: Diabetic Cataract Problem: డయాబెటిక్ పేషెంట్లలో కంటిశుక్లం ఎంత వరకు ప్రభావితం అవుతుందంటే?
అలాగే ఖాతాలో రూ.50 లక్షల కంటే ఎక్కువ జమ చేసినట్లయితే ఆ వివరాలను పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంక్ ఖాతా నుండి రూ.1 కోటి కంటే ఎక్కువ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్లో రూ.50,000 కంటే ఎక్కువ డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు లేదా విత్డ్రా చేసేటప్పుడు తప్పనిసరిగా పాన్ కార్డ్ను సమర్పించాలి. పాన్ కార్డు లేని నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను నోటీసులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొనుగోలుదారులు బ్యాంకుల్లోనే కాకుండా, ఏదైనా షాపింగ్ లేదా ఆభరణాల కొనుగోలులో కూడా రూ.50,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం తమ పాన్ వివరాలను అందించాల్సి ఉంటుంది గుర్తు పెట్టుకోవాలి.
Shyam Sundara Kulkarni: ప్రముఖ లిరిసిస్ట్ మృతి.. ఇండస్ట్రీలో విషాదం
తాజావార్తలు
-
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
-
Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
-
Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్పై దాడులు చేయబోమన్న పుతిన్
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
-
BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!