Chhattisgarh: పిల్లల కోసం క్షుద్ర పూజలు.. బతికి ఉన్న కోడిపిల్లను మింగిన వ్యక్తి.. కట్చేస్తే…
- ఛత్తీస్గఢ్లోని సుర్గుజాలో ఓ విచిత్ర ఘటన
- పెళ్లయి ఐదేళ్లు గడుస్తున్నా బిడ్డలు కాకపోవడంతో క్షుద్ర పూజలు
- తంత్ర మంత్రానికి బలైన వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని సుర్గుజాలో ఓ విచిత్రమైన, బాధాకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తంత్ర మంత్రానికి బలై.. బతికి ఉన్న కోడిపిల్లను మింగేశాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. తొలుత గుండెపోటుతో యువకుడు మృతి చెంది ఉంటాడని వైద్యులు భావించారు. అయితే పోస్ట్మార్టం చేయగా గొంతులో చనిపోయిన కోడిపిల్ల కనిపించింది.
READ MORE: Pushpa2 : హిందీలో వండర్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప -2
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
విషయం అంబికాపూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు చింద్కలో గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్ యాదవ్ (36)గా గుర్తించారు. పెళ్లయి ఐదేళ్లు గడుస్తున్నా బిడ్డలు కాకపోవడంతో ఆందోళన మొదలైంది. అప్పుడు ఓ వ్యక్తి తాంత్రికుడి దగ్గరకు వెళ్లాలని సలహా ఇచ్చాడు. దీంతో ఆ తాంత్రికుడు క్షుద్ర పూజల పేరుతో బతికి ఉన్న కోడిని మింగమని సూచించారు. ఆనంద్ ఏమీ ఆలోచించకుండా దాన్ని మింగేశాడు.
READ MORE:Expensive Tea: ఒక కప్పు టీ ధర రూ. లక్ష.. దీన్ని తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే?
ఈ అంశంపై అంబికాపూర్ హాస్పిటల్ ఫోరెన్సిక్ హెచ్వోడీ డాక్టర్ మాట్లాడుతూ.. ఆదివారం ఒక రోగిని మా వద్దకు తీసుకువచ్చారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని తొలుత అనిపించింది. ఆ తర్వాత మరణానికి అసలు కారణం తెలుసుకునేందుకు పోస్ట్మార్టం నిర్వహించాం. అయితే.. పేషెంట్ గుండెపోటుతో చనిపోలేదని తేలిపోయింది. గొంతు భాగాన్ని పరిశీలించగా.. కోడిపిల్లను చూశాం. అది యువకుడి శ్వాసనాళానికి, ఆహార పైపునకు మధ్య ఇరుక్కుపోయింది. దీని కారణంగా అతడు చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!