Chhattisgarh: పిల్లల కోసం క్షుద్ర పూజలు.. బతికి ఉన్న కోడిపిల్లను మింగిన వ్యక్తి.. కట్చేస్తే…
- ఛత్తీస్గఢ్లోని సుర్గుజాలో ఓ విచిత్ర ఘటన
- పెళ్లయి ఐదేళ్లు గడుస్తున్నా బిడ్డలు కాకపోవడంతో క్షుద్ర పూజలు
- తంత్ర మంత్రానికి బలైన వ్యక్తి
ఛత్తీస్గఢ్లోని సుర్గుజాలో ఓ విచిత్రమైన, బాధాకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తంత్ర మంత్రానికి బలై.. బతికి ఉన్న కోడిపిల్లను మింగేశాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. తొలుత గుండెపోటుతో యువకుడు మృతి చెంది ఉంటాడని వైద్యులు భావించారు. అయితే పోస్ట్మార్టం చేయగా గొంతులో చనిపోయిన కోడిపిల్ల కనిపించింది.
READ MORE: Pushpa2 : హిందీలో వండర్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప -2
Also Read
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
విషయం అంబికాపూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు చింద్కలో గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్ యాదవ్ (36)గా గుర్తించారు. పెళ్లయి ఐదేళ్లు గడుస్తున్నా బిడ్డలు కాకపోవడంతో ఆందోళన మొదలైంది. అప్పుడు ఓ వ్యక్తి తాంత్రికుడి దగ్గరకు వెళ్లాలని సలహా ఇచ్చాడు. దీంతో ఆ తాంత్రికుడు క్షుద్ర పూజల పేరుతో బతికి ఉన్న కోడిని మింగమని సూచించారు. ఆనంద్ ఏమీ ఆలోచించకుండా దాన్ని మింగేశాడు.
READ MORE:Expensive Tea: ఒక కప్పు టీ ధర రూ. లక్ష.. దీన్ని తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే?
ఈ అంశంపై అంబికాపూర్ హాస్పిటల్ ఫోరెన్సిక్ హెచ్వోడీ డాక్టర్ మాట్లాడుతూ.. ఆదివారం ఒక రోగిని మా వద్దకు తీసుకువచ్చారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని తొలుత అనిపించింది. ఆ తర్వాత మరణానికి అసలు కారణం తెలుసుకునేందుకు పోస్ట్మార్టం నిర్వహించాం. అయితే.. పేషెంట్ గుండెపోటుతో చనిపోలేదని తేలిపోయింది. గొంతు భాగాన్ని పరిశీలించగా.. కోడిపిల్లను చూశాం. అది యువకుడి శ్వాసనాళానికి, ఆహార పైపునకు మధ్య ఇరుక్కుపోయింది. దీని కారణంగా అతడు చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!