Karnataka Politics: లోక్సభ ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. ఐదుగురికి డిప్యూటీ సీఎం అవకాశాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అక్కడి ప్రభుత్వంలో మరో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఐదుగురిని ఉపముఖ్యమంత్రులను చేసే విషయమై చర్చిస్తున్నామని రాయరెడ్డి తెలిపారు. దీనికి పలువురు నేతలు మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
Govt Hospital: జగిత్వాలలో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం.. పేషెంట్ ను నేలపై పడుకోబెట్టిన సిబ్బంది..
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
సిద్ధరామయ్య ప్రభుత్వంలో మరో ఐదుగురు డిప్యూటీ సీఎంలను చేయాలనే ప్రతిపాదనకు హోంమంత్రి జి. పరమేశ్వర, ఎంబీ పాటిల్ సహా పలువురు నేతలు మద్దతు పలికారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ.. కనీసం ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.
Malaika Arora: ఖతర్నాక్ పోజులతో కిర్రాక్ పుట్టిస్తున్న మలైకా అరోరా
మెరుగైన పరిపాలన సాగించేందుకు ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలను నియమిస్తామన్న కేఎన్ రాజన్న ప్రకటనకు తన మద్దతు ఉందని బసవరాజ రాయరెడ్డి అన్నారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వంలో డీకే శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉండగా.. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఐదుగురు ఉపముఖ్యమంత్రులను చేస్తే మొత్తం ఆరుగురు డిప్యూటీ సీఎంలు అవుతారు.
Tragedy: విషాదం.. కొలంబియాలో ఆంధ్రా యువకుడు అనుమానాస్పద మృతి
తాజాగా మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న కూడా డిమాండ్ చేశారు. కర్నాటకలోని తుమకూరులో ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి పదవి షెడ్యూల్డ్ కుల- తెగకు ఒక పదవి, మైనారిటీ వర్గానికి ఒక పదవి, వీరశైవ సామాజికవర్గానికి చెందిన నాయకునికి ఒక పదవి ఇవ్వాలని ఆయన కోరాడు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!