Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో అత్యుత్తమ గుర్తింపు సాధించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కనబరిచిన అద్భుతమైన పనితీరును మెచ్చిన కేంద్ర ప్రభుత్వం, అందుకు ప్రోత్సాహకంగా రూ.200 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. కేంద్రం నుంచి అందిన ఈ అదనపు నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా-శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు, వైద్య మౌలిక వసతుల విస్తరణకు పూర్తిగా వినియోగించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశు సంరక్షణ విభాగాలను విస్తరించనున్నారు. అలాగే ప్రసవ గదులు (లేబర్ రూములు), ఆపరేషన్ థియేటర్లను జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. వీటితో పాటు మిడ్వైఫరీ-లెడ్ కేర్ యూనిట్లు, కంగారూ మదర్ కేర్ వార్డులు, లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్లను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా అధిక ప్రసవాలు జరిగే ఏరియా ఆసుపత్రుల్లో తల్లి, గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also Read
- YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్కు అనుగుణంగా అభివృద్ధి పరిచి, నేషనల్ క్వాలిటీ అష్యూరన్స్ సర్టిఫికేషన్ పొందేలా మౌలిక వసతులను కల్పించనున్నారు. ఈ నిధుల సహాయంతో చేపట్టే ఉచిత వైద్య సేవలు, ఆధునికీకరణ పనులు రాష్ట్రంలో మాతృ మరణాలు, నవజాత శిశు మరణాల రేటును మరింతగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో చేరే ప్రతి గర్భిణీకి, పుట్టిన బిడ్డకు అత్యుత్తమ వైద్యం ఉచితంగా అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ ప్రోత్సాహం వైద్య సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని, రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని జాతీయ ప్రమాణాలకు చేర్చడంలో ఇది ఎంతో దోహదపడుతుందని కమిషనర్ వివరించారు.
తాజావార్తలు
-
YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
-
Shweta Singh: సుశాంత్ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!