Daggubati Purandeswari: సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.. పురందేశ్వరి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari Meeting With AP BJP Social Media Wing: బూత్ స్థాయి నుంచి వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. విజయవాడలో బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్ అధ్యక్షతన రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భారతమాత ఫొటోకి పూలమాల వేసి, ఈ సమావేశాన్ని పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం ద్వారా ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్టప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పథకాల్ని వివరించి.. వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా.. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ఇంఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. కేశవ్ కాంత్ బీజేపీ సోషల్ మీడియా చేస్తున్న కార్యక్రమాలను ఎల్ఈడీ స్క్రీన్పై ప్లే చేసి చూపించారు.
Sai Pallavi: అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించిన సాయి పల్లవి..
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అండ.. కీలక ప్రకటన..
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అటు.. రేపు కూడా ఏపీ బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పురదేంశ్వరి ఆఫీస్ బేరర్ల సమావేశానికి హాజరు కానున్నారు. కమిటీల బలోపేతం.. కమిటీల్లో మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో చర్చే జరిగే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికే కమిటీ బాధ్యతలు అప్పగించాలంటూ ఇప్పటికే పురందేశ్వరి స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. పార్టీ అనుబంధ విభాగాలతోనూ ఆమె భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ తనకు రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇవ్వడంతో.. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం కసరత్తులు మొదలుపెట్టారు.
Heavy rains: దేశవ్యాప్తంగా మరో నాలుగైదు రోజుల పాటు భారీగా వర్షాలు..
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!