Daggubati Purandeswari: సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.. పురందేశ్వరి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari Meeting With AP BJP Social Media Wing: బూత్ స్థాయి నుంచి వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. విజయవాడలో బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్ అధ్యక్షతన రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భారతమాత ఫొటోకి పూలమాల వేసి, ఈ సమావేశాన్ని పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం ద్వారా ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్టప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పథకాల్ని వివరించి.. వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా.. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ఇంఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. కేశవ్ కాంత్ బీజేపీ సోషల్ మీడియా చేస్తున్న కార్యక్రమాలను ఎల్ఈడీ స్క్రీన్పై ప్లే చేసి చూపించారు.
Sai Pallavi: అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించిన సాయి పల్లవి..
Also Read
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
అటు.. రేపు కూడా ఏపీ బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పురదేంశ్వరి ఆఫీస్ బేరర్ల సమావేశానికి హాజరు కానున్నారు. కమిటీల బలోపేతం.. కమిటీల్లో మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో చర్చే జరిగే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికే కమిటీ బాధ్యతలు అప్పగించాలంటూ ఇప్పటికే పురందేశ్వరి స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. పార్టీ అనుబంధ విభాగాలతోనూ ఆమె భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ తనకు రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇవ్వడంతో.. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం కసరత్తులు మొదలుపెట్టారు.
Heavy rains: దేశవ్యాప్తంగా మరో నాలుగైదు రోజుల పాటు భారీగా వర్షాలు..
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!