Drug Enforcement in Hyd: తండ్రి బియ్యం వ్యాపారి.. కొడుకు డ్రగ్స్ వ్యాపారి..
- డ్రగ్స్ కు అలవాటు పడి అమ్మకం దారుగా మారిన లీలా కృష్ణ
- ఏ రకమైన డ్రగ్ కావాలన్నా సప్లై
- ఇటీవల పలు మార్లు పోలీసులకు దొరికిన నిందితుడు
- జైలుకు వెళ్లి వచ్చినా మారని వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ కు అలవాటు పడి అమ్మకం దారుగా మారిన 24 సంవత్సరాల లీలా కృష్ణ అనే యువకుడు.. ఎవరికి ఏ రకమైన డ్రగ్ కావాలన్నా సప్లై చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికే మూడుసార్లు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన లీలా కృష్ణ గురువారం నాలుగోసారి ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట కుశాల్ పార్క్ హై టెన్షన్ లైన్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్ టీ ఎఫ్ సీఐ నాగరాజు బృందం ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. బ్యాగులో డ్రగ్స్ ను పెట్టుకొని అమ్మకాలకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎక్సైజ్ పోలీసులు లీలా కృష్ణను పట్టుకున్నారు. అతని బ్యాగులో తనిఖీలు నిర్వహించగా 17.07 ఓజీ కుష్ గంజాయి, 2.34. గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 2 ఎల్ ఎస్ డి బ్లాస్ట్,220 గ్రాముల ఎండు గంజాయి లభించింది. పట్టుబడిన డ్రగ్స్ గంజాయి విలువ రూ.1.40 లక్షలు గా ఉంటుందని సీఐ తెలిపారు.
READ MORE: Vijaysai Reddy: మేం మళ్లీ అధికారంలోకి వస్తాం.. చంద్రబాబు జైలుకు వెళ్తాడు!
Also Read
- SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు పట్టుబడిన లీలా కృష్ణ 2022,2023 లో ఎస్ఓటి పోలీసులకు పట్టుబడ్డాడు. 2024 మేలో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు పట్టుబడ్డాడు. మూడుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా కూడా తన అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేదు. గోవాలోని అంజనా బీచ్ లో ఉన్నటువంటి డ్రగ్స్ వ్యాపారి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి హైదరాబాదుకు తీసుకువచ్చి ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ అమ్ముతుంటాడు. తండ్రి బియ్యం వ్యాపారం చేస్తుంటే కొడుకు మాత్రం డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. లీలా కృష్ణను పట్టుకున్న టీంలో సీఐ నాగరాజు తో పాటు ఎస్సై జ్యోతి, హెడ్ కానిస్టేబుల్ అన్వర్ లేక సింగ్, కానిస్టేబుల్ రాజేశ్వర్ వికాస్ శశి చంద్రశేఖర్ ఉన్నారు. అన్ని రకాల డ్రగ్స్ ను అమ్మకాలు జరిపే నొటోరియల్ క్రిమినల్ లీలా కృష్ణను పట్టుకున్న టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు.
తాజావార్తలు
-
SPIRIT : ప్రభాస్తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!