Road Accident: కెనాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృత్యువాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: పంజాబ్లోని ముక్త్సర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు కెనాల్లో పడిపోయిన ఘటనలో దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ముక్త్సర్ జిల్లాలోని సిర్హింద్ ఫీడర్ కెనాల్లో 35 మందితో వెళ్తున్న ప్రైవేట్ బస్సు పడిపోయిన ఘటనలో 8 మంది ప్రయాణికులు మరణించారని అధికారులు తెలిపారు. ముక్త్సర్-కొట్కాపురా రహదారిలోని ఝబెల్వాలి గ్రామ సమీపంలో డ్రైవర్ సడెన్ బ్రేకులు వేయడంతో బస్సు అదుపు తప్పి కాలువ పడిపోయిందని, ఈ సంఘటన జరిగిన సమయంలో వర్షం కురుస్తోందని వారు తెలిపారు.
Also Read: Nawaz Sharif: భారత్ చంద్రునిపైకి చేరితే, పాక్ పక్క దేశాలను అడుక్కుంటోంది..
Also Read
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
- Indian Fast Bowler: గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే సామర్థ్యం.. ఇండియాకు దొరికిన అద్భుత బౌలర్..
రెస్క్యూ ఆపరేషన్ కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాన్ని రప్పించారు. ఘటన జరిగిన సమయంలో బస్సు ముక్త్సర్ నుంచి కొట్కాపురా వెళ్తోంది. ముక్త్సర్ డిప్యూటీ కమిషనర్ రూహీ డగ్ ప్రకారం, కాలువలో బలమైన నీటి ప్రవాహానికి కొంతమంది ప్రయాణికులు కొట్టుకుపోయి ఉండవచ్చని అనుమానించారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని డగ్ తెలిపారు.
క్రేన్ సాయంతో బస్సును కాలువ నుంచి బయటకు తీశామని, గాయపడిన కొంతమంది ప్రయాణికులను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. బస్సు డ్రైవర్ ప్రకారం, బస్సులో మొత్తం ప్రయాణికుల సంఖ్య 35 మంది వరకు ఉండవచ్చని డీసీపీ రూహీ డగ్ చెప్పారు. ప్రమాదం జరగడంతో గ్రామస్తులు ముందుకు వచ్చి ప్రయాణికులను రక్షించారు.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ.. జిల్లా పరిపాలన బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని, రెస్క్యూ ఆపరేషన్ గురించి తనకు ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
-
CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్కు బిగ్ ప్లాన్.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటు!
-
Prabhas: ప్రభాస్ ఇటలీ విల్లా రెంట్ ఎంతో చెప్పిన ప్రభాస్ శ్రీను!
-
Prabhas Srinu: “నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.10 వేలు.. అత్యధికంగా రెండు రోజులకు రూ.3 లక్షలు అందుకున్నా”
-
Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!