Nawaz Sharif: భారత్ చంద్రునిపైకి చేరితే, పాక్ పక్క దేశాలను అడుక్కుంటోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nawaz Sharif: దేశంలో అల్లకల్లోలానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ గూఢచారి ఫైజ్ హమీద్ కారణమని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని ఆయన అన్నారు. పాకిస్థాన్ను పాలించిన గత ప్రధానులు అవినితీకి పాల్పడి.. దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేశారని ఆరోపణలు చేశారు.” భారతదేశం చంద్రునిపైకి చేరుకుంది. భారత్లో జీ20 సమావేశం జరిగింది. కానీ పాకిస్తాన్ ప్రపంచ దేశాల నుంచి ఒక బిలియన్ డాలర్లు యాచిస్తోంది” అని ఆయన అన్నారు. భారత్ ఆర్థికాభివృద్ధిని మెచ్చుకున్న షరీఫ్.. పాకిస్థాన్ మెడకు చుట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయి, తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉండడం విచారించదగ్గ విషయమని, ఆ దేశ ప్రధాని భిక్షాటన చేయాల్సిందేనని షరీఫ్ అన్నారు. డబ్బు అడగాలంటే బీజింగ్, అరబ్ దేశాల రాజధానులకు వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు.
“ఈ దుస్థితికి కారణం ఎవరు..? వాజ్పేయీ కాలంలో ఇండియా వద్ద నిల్వలు చాలా తక్కువగా ఉండేవని, అదే ప్రస్తుతం వారి నిల్వలు 600 బిలియన్ డాలర్ల వరకు చేరాయి.’ అని లాహోర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుంచి నవాజ్ షరీఫ్ మాట్లాడారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా దిగజారిపోతోంది. ప్రస్తుతం పాకిస్థాన్లో ప్రజలకు తిండి పెట్టలేని దుస్థితి ఏర్పడింది. ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యకు చేరగా.. పాక్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు జులైలో ఐఎంఎఫ్ నిధులను సమకూర్చిన సంగతి తెలిసిందే.
Also Read
Also Read: Armenia-Azerbaijan War: మరోసారి యుద్ధం.. భారత్ ఆయుధాలకు ఆ దేశం భయపడుతోందా?
మాజీ ఆర్మీ చీఫ్కి ఇమ్రాన్ఖాన్ మద్దతు
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ గూఢచారి, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (డీజీ-ఐఎస్ఐ) డైరెక్టర్ జనరల్ (డీజీ-ఐఎస్ఐ) ఫైజ్ హమీద్లకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతు లభించింది. ఇమ్రాన్ ఖాన్ హయాంలో బజ్వా పదవీకాలం పొడిగించబడింది. 2018 ఎన్నికల్లో మాజీ క్రికెటర్ విజయం సాధించేందుకు ఎన్నికల్లో రిగ్గింగ్ చేశాడని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ హయాంలో హమీద్ DG-ISIగా నియమితులయ్యారు.
ఎన్నికలపై ప్రభుత్వ తర్జనభర్జనలు
ఎన్నికల తేదీల విషయంలో న్యాయవ్యవస్థ, శాసనమండలి, కార్యనిర్వాహక వర్గాల్లో చిచ్చు రాజుకోవడంతో పాకిస్థాన్లో ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. 2024 జనవరిలో ఎన్నికలు నిర్వహించవచ్చని ఆగస్టులో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ECP) చెప్పింది, అయితే ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీకి చెందిన పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం నవంబర్లో నిర్వహించాలి. జాతీయ సభను రద్దు చేయడం ముందస్తుగా జరిగినందున, పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం, 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. సాధారణ పరిస్థితుల్లో అసెంబ్లీ పదవీకాలం పూర్తికాగానే 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
నవాజ్ షరీఫ్ దేశానికి తిరిగి రావాలని తహతహలాడుతున్నారు..
కాగా, పాకిస్థాన్లో ఎన్నికల నగారా మోగుతుండడంతో నవాజ్ షరీఫ్ తిరిగి అక్కడికి వెళ్లాలనుకుంటున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (PML-N) చీఫ్ నవాజ్ షరీఫ్ ఆరోగ్య కారణాల వల్ల నవంబర్ 2019 నుండి లండన్లో స్వీయ ప్రవాసంలో ఉన్నారు. నవంబర్ 2019లో, నవాజ్ షరీఫ్కు అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. వైద్య కారణాలతో దేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21న ఆయన పాకిస్థాన్కు తిరిగి వస్తానని ప్రకటించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!