Nawaz Sharif: భారత్ చంద్రునిపైకి చేరితే, పాక్ పక్క దేశాలను అడుక్కుంటోంది..
Nawaz Sharif: దేశంలో అల్లకల్లోలానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ గూఢచారి ఫైజ్ హమీద్ కారణమని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని ఆయన అన్నారు. పాకిస్థాన్ను పాలించిన గత ప్రధానులు అవినితీకి పాల్పడి.. దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేశారని ఆరోపణలు చేశారు.” భారతదేశం చంద్రునిపైకి చేరుకుంది. భారత్లో జీ20 సమావేశం జరిగింది. కానీ పాకిస్తాన్ ప్రపంచ దేశాల నుంచి ఒక బిలియన్ డాలర్లు యాచిస్తోంది” అని ఆయన అన్నారు. భారత్ ఆర్థికాభివృద్ధిని మెచ్చుకున్న షరీఫ్.. పాకిస్థాన్ మెడకు చుట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయి, తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉండడం విచారించదగ్గ విషయమని, ఆ దేశ ప్రధాని భిక్షాటన చేయాల్సిందేనని షరీఫ్ అన్నారు. డబ్బు అడగాలంటే బీజింగ్, అరబ్ దేశాల రాజధానులకు వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు.
“ఈ దుస్థితికి కారణం ఎవరు..? వాజ్పేయీ కాలంలో ఇండియా వద్ద నిల్వలు చాలా తక్కువగా ఉండేవని, అదే ప్రస్తుతం వారి నిల్వలు 600 బిలియన్ డాలర్ల వరకు చేరాయి.’ అని లాహోర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుంచి నవాజ్ షరీఫ్ మాట్లాడారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా దిగజారిపోతోంది. ప్రస్తుతం పాకిస్థాన్లో ప్రజలకు తిండి పెట్టలేని దుస్థితి ఏర్పడింది. ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యకు చేరగా.. పాక్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు జులైలో ఐఎంఎఫ్ నిధులను సమకూర్చిన సంగతి తెలిసిందే.
Also Read
Also Read: Armenia-Azerbaijan War: మరోసారి యుద్ధం.. భారత్ ఆయుధాలకు ఆ దేశం భయపడుతోందా?
మాజీ ఆర్మీ చీఫ్కి ఇమ్రాన్ఖాన్ మద్దతు
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ గూఢచారి, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (డీజీ-ఐఎస్ఐ) డైరెక్టర్ జనరల్ (డీజీ-ఐఎస్ఐ) ఫైజ్ హమీద్లకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతు లభించింది. ఇమ్రాన్ ఖాన్ హయాంలో బజ్వా పదవీకాలం పొడిగించబడింది. 2018 ఎన్నికల్లో మాజీ క్రికెటర్ విజయం సాధించేందుకు ఎన్నికల్లో రిగ్గింగ్ చేశాడని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ హయాంలో హమీద్ DG-ISIగా నియమితులయ్యారు.
ఎన్నికలపై ప్రభుత్వ తర్జనభర్జనలు
ఎన్నికల తేదీల విషయంలో న్యాయవ్యవస్థ, శాసనమండలి, కార్యనిర్వాహక వర్గాల్లో చిచ్చు రాజుకోవడంతో పాకిస్థాన్లో ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. 2024 జనవరిలో ఎన్నికలు నిర్వహించవచ్చని ఆగస్టులో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ECP) చెప్పింది, అయితే ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీకి చెందిన పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం నవంబర్లో నిర్వహించాలి. జాతీయ సభను రద్దు చేయడం ముందస్తుగా జరిగినందున, పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం, 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. సాధారణ పరిస్థితుల్లో అసెంబ్లీ పదవీకాలం పూర్తికాగానే 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
నవాజ్ షరీఫ్ దేశానికి తిరిగి రావాలని తహతహలాడుతున్నారు..
కాగా, పాకిస్థాన్లో ఎన్నికల నగారా మోగుతుండడంతో నవాజ్ షరీఫ్ తిరిగి అక్కడికి వెళ్లాలనుకుంటున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (PML-N) చీఫ్ నవాజ్ షరీఫ్ ఆరోగ్య కారణాల వల్ల నవంబర్ 2019 నుండి లండన్లో స్వీయ ప్రవాసంలో ఉన్నారు. నవంబర్ 2019లో, నవాజ్ షరీఫ్కు అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. వైద్య కారణాలతో దేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21న ఆయన పాకిస్థాన్కు తిరిగి వస్తానని ప్రకటించారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!