అగ్రరాజ్యం అమెరికా పౌరసత్వాల్లో భారతీయులు రికార్డ్ సృష్టిస్తున్నారు. 2022లో 65, 960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరులుగా మారగా.. తాజా యూఎస్ లో కొత్తగా పౌరసత్వాలు పొందిన వారిలో మెక్సికో తర్వాత భారత్ రెండవ అతిపెద్ద దేశంగా నిలిచింది. యూఎస్ సెన్సెస్ బ్యూరోకు చెందిన అమెరికన్ కమ్యూనిటీ సర్వే డేటా ప్రకారం.. 2022లో 4.6 కోట్ల మంది విదేశాల్లో జన్మించిన పౌరులు యునైటెడ్ స్టేట్స్లో ఉంటున్నట్లు అంచనా వేసింది. ఇది మొత్తం యూఎస్ జనాభా 33.3 కోట్లలో దాదాపు 14 శాతం మేర ఉంటుంది. వీరిలో 2.45 మిలియన్ల మంది అంటే దాదాపు 53 శాతం మంది సహజ పౌరులుగా గుర్తించింది.
Read Also: Virat Kohli: ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్గా..!
ఇక, ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ఏప్రిల్ 15వ తేదీ నాటి యూఎస్ నేచురలైజేషన్ పాలసీ నివేదిక ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో 9,69,380 మంది యూఎస్ పౌరులుగా మారారు. మెక్సికోలో జన్మించిన వారు అత్యధిక సంఖ్యలో లోకల్ పౌరులుగా పరిగణించబడుతున్నారు. ఇక, భారత్, ఫిలిప్పీన్స్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్ నుంచి వచ్చిన వ్యక్తులు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారని నివేదిక పేర్కొంది.
Read Also: Maldives Elections: మాల్దీవుల ఎన్నికల్లో ముయిజ్జు పార్టీకి భారీ విజయం..
అయితే, తాజా నివేధిక ప్రకారం.. 2022లో 128, 878 మంది మెక్సికన్ పౌరులు అమెరికన్ సిటిజన్స్ గా మారారని సీఆర్ఎస్ తెలిపింది. వారి తర్వాతి స్థానాల్లో ఇండియన్స్ (65,960), ఫిలిప్పీన్స్ (53,413), క్యూబా (46,913), డొమినికన్ రిపబ్లిక్ (34,525), వియత్నాం (33,246), చైనా (27.038) దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. ఇక, సీఆర్ఎస్ డేటా ప్రకారం.. 2023 నాటికి, 28,31,330 మంది విదేశీ అమెరికన్లు భారత్కు చెందిన వారే అధికంగా ఉన్నారు. ఇది మెక్సికో 1,06,38,429 తర్వాత సెకండ్ ప్లేన్ అని చెప్పొచ్చు. ఆ తరువాత స్థానంలో చైనాకు చెందిన విదేశీ అమెరికన్లు 22, 25, 447 మంది పౌరులు ఉన్నారు.