Encounter: జార్ఖండ్లో ఎన్కౌంటర్.. నలుగురు మావోలు హతం, ఇద్దరు అరెస్ట్
- జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్
- పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో భద్రతా దళాలు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
- ఒక మహిళ సహా నలుగురు మావోయిస్టులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో భద్రతా దళాలు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని గువా పోలీస్ స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతానికి సమీపంలో ఉదయం 5 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరిని అరెస్టు చేశామని జార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి, ఐజీ (ఆపరేషన్స్) అమోల్ వి హోంకర్ పీటీఐకి తెలిపారు.
Beenz: శర్వానంద్ తమ్ముడి రెస్టారెంట్ రీ లాంచ్.. ఎక్కడో తెలుసా?
Also Read
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
సెర్చ్ ఆపరేషన్లో ఒక INSAS రైఫిల్, రెండు SLRలు, మూడు రైఫిల్స్, ఒక (9mm) పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు హోంకర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హత్యకు గురైన మావోయిస్టులు చైబాసాలోని తాల్కోబాద్కు చెందిన జోనల్ కమాండర్ కండె హోన్హగాగా గుర్తించామని తెలిపారు. ఛత్తీస్గఢ్లోని జైగూర్ పోలీస్ స్టేషన్ ఏరియా, ఏరియా కమాండర్ సూర్య అలియాస్ ముండా దేవగం, మహిళా కేడర్ జుంగా పూర్తి అలియాస్ మార్లా ఉన్నట్లు తెలిపారు. సింగ్రాయ్ పై రూ. 10 లక్షలు, కాండేపై రూ. 5 లక్షలు, సూర్య పై రూ. 2 లక్షలు రివార్డు ఉంని పేర్కొన్నారు.
Pushpa 2: అనుకున్నట్టే అయింది.. డిసెంబర్ కి పుష్ప 2 వాయిదా
సింగ్రాయ్, కాండే ఐఈడీ (IED) నిపుణులు. వారు ఐఇడిలు అమర్చడం, పర్యవేక్షించడం చేస్తారని ఐజి చెప్పారు. అరెస్టయిన మావోయిస్టులలో ఏరియా కమాండర్ టైగర్ అలియాస్ పాండు హన్స్దా, బత్రీ దేవగమ్ ఉన్నారు. మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారంతో.. చైబాసా పోలీసులు, కోబ్రా 209, జార్ఖండ్ జాగ్వార్ మరియు సిఆర్పిఎఫ్లతో కూడిన భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఉదయం 5 గంటలకు బృందం ఆ ప్రాంతానికి చేరుకుని మావోయిస్టుల బృందంపై దాడి చేశారు. సుమారు గంటపాటు కాల్పులు జరిగాయి. కాల్పులు ముగిసిన అనంతరం.. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ అధునాతన ఆయుధాలతో సహా, మందుగుండు సామగ్రితో పాటు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!