PM Modi: 400 సీట్ల ప్రస్తావన వెనుక ఉన్న ఉద్దేశం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలంటూ ప్రధాని మోడీ ప్రతీ సభల్లో విజ్ఞప్తి చేస్తు్న్నారు. రోడ్ షోలోనైనా, బహిరంగ సభల్లోనైనా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ పర్యటిస్తు్న్నారు. ఈ పర్యటనలో 400 సీట్లు ఇవ్వాలని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు.
అభివృద్ధి, అవినీతి విముక్త భారత్ కోసమే 400 ప్లస్ సీట్లను బీజేపీ అడుగుతోందని కర్ణాటకలోని శివమొగ్గలో ప్రధాని తెలిపారు. అధికారం కోసం ఎంతదూరం వెళ్లడానికైనా కాంగ్రెస్ సిద్ధపడుతుందని ఆ పార్టీపై మోడీ విమర్శలు గుప్పించారు. బ్రిటిషర్లు దేశాన్ని విడిచివెళ్లినా, విభజించు-పాలించు అనే బ్రిటిషర్ల మనస్తత్వం మాత్రం కాంగ్రెస్కు పోలేదని ఎద్దేవా చేశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
దేశాన్ని కులం, మతం, ప్రాంతం, భాషల పరంగా విభజించి అధికారం అనుభవించినా, విభజన కాంక్ష మాత్రం కాంగ్రెస్కు తీరలేదన్నారు. కాంగ్రెస్ మళ్లీ దేశాన్ని విభజించాలనే ప్రమాదకరమైన ఆట మొదలుపెట్టిందని, వారి అభిప్రాయాలను ఇప్పుడు బహిరంగంగానే చెబుతున్నారని మోడీ తప్పుపట్టారు. దేశం మరోసారి విడిపోతుందని ఇటీవలే కర్ణాటక ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారని, అలాంటి ఎంపీని పార్టీ నుంచి విసిరిపారేయకుండా కాంగ్రెస్ పార్టీ అతనికి బాసటగా నిలుస్తోందన్నారు. అలాంటి రాజకీయాలు, కుట్రలను కర్ణాటక ప్రజలు ఎప్పటికీ విజయవంతం కానీయరని మోడీ ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. శక్తి వివాదంపై క్లారిటీ
#WATCH | Shivamogga, Karnataka: PM Narendra Modi says, "4 June ko 400 paar. Karnataka voters have a big responsibility in this mission. Why are we talking about 400 seats? 400 paar for Viksit Bharat, Viksit Karnataka…" pic.twitter.com/2qdKjwcA9L
— ANI (@ANI) March 18, 2024
తాజావార్తలు
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!