Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News 35 Families Joined Ycp In The Presence Of Mla Nambur Shankar Rao

Namburu Sankara Rao: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైసీపీలోకి 35 కుటుంబాలు

NTV Telugu Twitter
Published Date :April 20, 2024 , 1:16 pm
By Chandra Shekhar
Namburu Sankara Rao: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైసీపీలోకి 35 కుటుంబాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమరావతిలో వైఎస్సార్సీపీలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. ఇటీవల ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ఎత్తున పార్టీలో చేరగా.. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో జరిగిన అభివృద్ధికి, ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని కోరారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమం అందించానన్నారు. సీఎం జగన్ పాలనలో చేసిన మంచి, జరిగిన అభివృద్ధి చూసి ఎంతోమంది పార్టీలో చేరుతున్నారన్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే నంబూరి శంకరరావు పిలుపునిచ్చారు.

Read Also: Betul Accident : లోక్ సభ ఎన్నికల విధుల నుంచి తిరిగి వస్తున్న సైనికుల బస్సు బోల్తా

ఇక, వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం సాధ్యమని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. మండల కేంద్రమైన అమరావతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో అమరావతి మెయిన్ రోడ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే శంకరరావు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పేదల పార్టీ అని.. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించారని నంబూరి శంకరరావు తెలిపారు.

Read Also: K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరు.. కేసీఆర్‌ పై లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

అయితే, అక్కచెల్లమ్మలకు ఆసరా కల్పించారు అని ఎమ్మెల్యే శంకరరావు తెలిపారు. అన్న దాతలకు భరోసా ఇచ్చారు.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు.. పాఠశాలలు బాగు చేసి మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారని వెల్లడించారు. తాను కూడా 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాను.. అమరావతి – బెల్లంకొండ రోడ్డు, అమరావతి – తుళ్లూరు రోడ్డు, పెదమద్దూరు బ్రిడ్జి పూర్తి చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో 27 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. కాగా, 23 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఆర్ధికంగా బలపడడానికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఆస్తుంటే సోమరిపోతులను చేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారన్నారు.

Read Also: PM Modi: యువరాజుకి వయనాడ్లో కూడా ఓటమి భయం పట్టుకుంది..

అలాగే, ఒకప్పుడు వాలంటీర్లను దొంగలతో పోల్చిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామంటున్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు చెప్పారు. సీఎం జగన్ బాటలో నడుస్తూనే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి.. మంచి చేసిన వారికి ఓటు వేసి గెలిపించాలన్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని.. మరోసారి అవకాశమిస్తే రాష్ట్రానికి రోల్ మోడల్ గా మార్చి మీ చేతుల్లో పెడతానని పేర్కొన్నారు. తాను చేసిన మంచిని చూసి తనకు అండగా నిలవాలని ఆయన కోరారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. మళ్లీ జన్మభూమి కమిటీల అరాచకాలు మొదలవుతాయన్నారు. మనం ఇప్పుడు నిర్మిస్తున్న అమరావతి – బెల్లంకొండ రోడ్డు, మదయదూరు బ్రిడ్జి మళ్లీ కడతానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పూటకో మాటతో ప్రజలను మభ్యపెడుతన్న చంద్రబాబు పాలన మనకు అవసరమని నంబూరు శంకరరావు ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 35 families
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • cm jagan
  • Joined YSRCP

తాజావార్తలు

  • Tourist Family: నాణానికి మరో కోణం.. భయంకరం!

  • Caste Census: కర్ణాటకలో మళ్లీ కులగణన.. ప్రకటించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌

  • Balakrishna : నన్ను చూసుకునే నాకు పొగరు.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్

  • Honeymoon Murder: భర్తని చంపి సోనమ్ ఎలా తప్పించుకుంది.. పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చింది..?

  • Ambati Rambabu: ఎవరిని అరెస్టు చేసినా.. 2 నెలలు బయటకు రాకుండా చేస్తున్నారు..!

ట్రెండింగ్‌

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions