Bihar Crime News: దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: దసరా ఉత్సవాల్లో అపశృతి దొర్లింది . పండగపూట పెను విషాదం చోటు చేసుకుంది. సంతోషంగా అమ్మవారి దర్శనానికి వెళ్లిన వారు తొక్కిసలాట కారణంగా ప్రాణాలను కోల్పోయారు.ఈ ఘటన బిహార్లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. బీహార్ లోని రాజా దళ్ ప్రాంతంలో దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గా పూజ వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి భద్రత చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడం కారణంగా తొక్కసలాట నెలకొంది. ఈక్రమంలో ఓ 5 ఏళ్ళ బాలుడు తో పాటుగా ఇద్దరు మహిళలు మృతి చెందారు.
Read also:US: H-1B వీసా ప్రక్రియలో US కొత్త ప్రతిపాదనలు ఇవే ..
Also Read
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
ఈ ఘటన పైన గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో రాజాదలళ్ పూజా పండల్ గేటు దగ్గర తొక్కిసలాట జరిగిందని.. ఈ క్రమంలో ఓ 5 ఏళ్ళ బాలుడు కింద పడిపోయాడని.. ఆ చిన్నారిని రక్షించేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించగా ఆ ఇద్దరు మహిళలు కూడా కొంద పడిపోయారని.. అదే సమయంలో భక్తులు ప్రసాదం కోసం బారులు తీరడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారని.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే లోపే మరణించారని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించినట్లు తెలిపారు. కాగా ఈ ఘటనలో మరో 10 మంది గాయపడగా గాయపడినవారిని వారిని సదర్ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం కారణంగానే మండపం వద్ద తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!