Telugu Students: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Students: ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన మరొక విద్యార్థి అమెరికాలోని వారి కనెక్టికట్ వసతి గృహంలో చనిపోయారని కుటుంబసభ్యులు సోమవారం వెల్లడించారు. విద్యార్థులను తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్ (22), ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన నికేష్ (21)గా గుర్తించారు. తెలంగాణకు చెందిన దినేష్ అమెరికా వెళ్లిన రెండు వారాల్లోనే అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డారు. రూమ్లో ఆ యువకుడితో పాటు మరో యువకుడు నికేష్ మృతదేహాలను గుర్తించిన పోలీసులు, ఇండియాలోని తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అద్దెకుంటున్న ఇంట్లోనే ఇద్దరు యువకులు విగతజీవులుగా కనిపించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. “సమీప గదిలో నివసించే దినేష్ స్నేహితులు శనివారం రాత్రి మాకు ఫోన్ చేసి అతని మరణం, అతని రూమ్మేట్ గురించి మాకు తెలిపారు. అతను ఎలా మరణించాడు అనే దానిపై మాకు ఎటువంటి క్లూ లేదు” అని దినేష్ కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Also: Secunderabad: స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన మటన్.. వ్యక్తి దారుణ హత్య..
Also Read
- Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తికి చెందిన దినేష్ 2023 డిసెంబర్ 28న ఉన్నత చదువుల కోసం అమెరికాలోని కనెక్టికట్లోని హార్ట్ఫోర్డ్కు వెళ్లగా, నికేష్ కొన్ని రోజుల తర్వాత చేరుకున్నాడు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అమెరికాకు వెళ్లి 17 రోజులు మాత్రమే అవుతోంది. ఇంతలోనే కుమారుడు మరణించాడనే వార్త విని అతని తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దినేశ్తో పాటు అదే గదిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో విద్యార్థి మృతి చెందినట్లు, మృతుడి బంధువులకు కూడా సమాచారం అందించారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ఇద్దరు యువకులు నిద్రలో ఉండగానే మరణించినట్టుగా అక్కడి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించిన అనంతరమే మరణానికి గల కారణాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే వారి మృతదేహాలను ఇండియాకు పంపించనున్నట్టు తెలిపారు. విషవాయువు పీల్చడంతో చనిపోయి ఉండొచ్చని అమెరికా నుంచి సమాచారం వచ్చినట్లు బంధువులు చెబుతున్నారు.
Read Also: Killer Soup: కిల్లర్ సూప్.. తెలంగాణలో జరిగిన రియల్ కథ అని తెలుసా.. ?
దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం కోరినట్లు దినేష్ కుటుంబ సభ్యుడు పేర్కొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని అమెరికా నుంచి భారత్కు తీసుకురావడంపై ఎమ్మెల్యే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాట్లాడారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.విద్యార్థి మృతి పట్ల సంతాపం తెలిపిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి పట్టణంలో కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. అంతేకాకుండా, నికేష్ కుటుంబ సభ్యులతో తమకు ఎలాంటి పరిచయం లేదని, వారిద్దరూ ఇటీవలే అమెరికా వెళ్లారని దినేష్ కుటుంబ సభ్యుడు తెలిపారు. అలాగే శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగానికి కూడా నికేష్పై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. జిల్లా కలెక్టరేట్కు కూడా నికేష్ లేదా అతని కుటుంబ సభ్యుల సమాచారం అందలేదని శ్రీకాకుళం పోలీస్ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కె.బాలరాజు గుర్తించారు.
తాజావార్తలు
-
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
-
Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
-
Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. స్టార్ దర్శకుడితో సినిమా డౌటే
-
Bollywood Gossip : నేను ‘గే’ కాదు… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!