Telugu Students: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Students: ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన మరొక విద్యార్థి అమెరికాలోని వారి కనెక్టికట్ వసతి గృహంలో చనిపోయారని కుటుంబసభ్యులు సోమవారం వెల్లడించారు. విద్యార్థులను తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్ (22), ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన నికేష్ (21)గా గుర్తించారు. తెలంగాణకు చెందిన దినేష్ అమెరికా వెళ్లిన రెండు వారాల్లోనే అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డారు. రూమ్లో ఆ యువకుడితో పాటు మరో యువకుడు నికేష్ మృతదేహాలను గుర్తించిన పోలీసులు, ఇండియాలోని తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అద్దెకుంటున్న ఇంట్లోనే ఇద్దరు యువకులు విగతజీవులుగా కనిపించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. “సమీప గదిలో నివసించే దినేష్ స్నేహితులు శనివారం రాత్రి మాకు ఫోన్ చేసి అతని మరణం, అతని రూమ్మేట్ గురించి మాకు తెలిపారు. అతను ఎలా మరణించాడు అనే దానిపై మాకు ఎటువంటి క్లూ లేదు” అని దినేష్ కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Also: Secunderabad: స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన మటన్.. వ్యక్తి దారుణ హత్య..
Also Read
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తికి చెందిన దినేష్ 2023 డిసెంబర్ 28న ఉన్నత చదువుల కోసం అమెరికాలోని కనెక్టికట్లోని హార్ట్ఫోర్డ్కు వెళ్లగా, నికేష్ కొన్ని రోజుల తర్వాత చేరుకున్నాడు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అమెరికాకు వెళ్లి 17 రోజులు మాత్రమే అవుతోంది. ఇంతలోనే కుమారుడు మరణించాడనే వార్త విని అతని తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దినేశ్తో పాటు అదే గదిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో విద్యార్థి మృతి చెందినట్లు, మృతుడి బంధువులకు కూడా సమాచారం అందించారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ఇద్దరు యువకులు నిద్రలో ఉండగానే మరణించినట్టుగా అక్కడి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించిన అనంతరమే మరణానికి గల కారణాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే వారి మృతదేహాలను ఇండియాకు పంపించనున్నట్టు తెలిపారు. విషవాయువు పీల్చడంతో చనిపోయి ఉండొచ్చని అమెరికా నుంచి సమాచారం వచ్చినట్లు బంధువులు చెబుతున్నారు.
Read Also: Killer Soup: కిల్లర్ సూప్.. తెలంగాణలో జరిగిన రియల్ కథ అని తెలుసా.. ?
దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం కోరినట్లు దినేష్ కుటుంబ సభ్యుడు పేర్కొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని అమెరికా నుంచి భారత్కు తీసుకురావడంపై ఎమ్మెల్యే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాట్లాడారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.విద్యార్థి మృతి పట్ల సంతాపం తెలిపిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి పట్టణంలో కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. అంతేకాకుండా, నికేష్ కుటుంబ సభ్యులతో తమకు ఎలాంటి పరిచయం లేదని, వారిద్దరూ ఇటీవలే అమెరికా వెళ్లారని దినేష్ కుటుంబ సభ్యుడు తెలిపారు. అలాగే శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగానికి కూడా నికేష్పై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. జిల్లా కలెక్టరేట్కు కూడా నికేష్ లేదా అతని కుటుంబ సభ్యుల సమాచారం అందలేదని శ్రీకాకుళం పోలీస్ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కె.బాలరాజు గుర్తించారు.
తాజావార్తలు
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!