వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్ నుండి కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం అధికారులు విచారణ చేపట్టారు. కస్టమ్ బృందం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలోని ప్రధాన టెర్మినల్ భవనంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా బంగారాన్ని టాయిలెట్లో దాచిన ప్రయాణీకులను గుర్తిస్తున్నారు. షార్జా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు టాయిలెట్లో బంగారాన్ని దాచినట్లు కస్టమ్స్ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : Telangana Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
వాస్తవానికి బుధవారం షార్జా నుంచి వారణాసి విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX 184 నుండి వస్తున్న ప్రయాణికులను కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రయాణీకుల తనిఖీ పూర్తయిన తర్వాత, బృందం సాధారణ తనిఖీ కోసం టాయిలెట్కు కూడా తనిఖీ చేసింది. టాయిలెట్లోని విచారణలో, ఒక నల్లటి ప్లాస్టిక్ కవర్ లో ఈ బంగారం పట్టబడింది.
Also Read : Mussoorie Lake: అమ్మకానికి ముస్సోరీ సరస్సులో నీరు.. ఎందుకో తెలుసా..!
మరుగుదొడ్డిలోబంగారం దొరకడంపై అధికారులు విచారణ జరిపి, ఆపై దానిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ టీమ్ దానిని తెరవగా అందులో నుంచి 16 బంగారు బిస్కెట్లు లభించాయి. రికవరీ చేసిన బిస్కెట్ల బరువు 1866.100 గ్రాములు కాగా ధర కోటి పన్నెండు లక్షల యాభై రెండు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు ఉంటుందని తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం మరుగుదొడ్లకు వెళ్లే ప్రయాణికులను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కస్టమ్ టీమ్ గుర్తిస్తోంది. స్వాధీనం చేసుకున్న బంగారం విదేశీదిగా గుర్తించారు.