Manjeera Kumbh Mela: మంజీరా నది కుంభమేళా షురూ.. 12 రోజుల పాటు మహావేడుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manjeera Kumbh Mela: మన దేశంలో నదులను కూడా దేవతలుగా పూజిస్తారు. అందుకే పన్నెండేళ్ల కోసారి పుష్కరాల పేరుతో ఘనంగా వేడుకలను నిర్వహించి.. నదీమ తల్లిని పూజిస్తారు. పుష్కరాలతో పాటు కుంభమేళాను కూడా నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా కుంభమేళా సోమవారం ప్రారంభమైంది. న్యాల్కల్ మండలం రాఘవాపూర్-చాల్కి గ్రామాల మధ్య మంజీరా నది ఒడ్డున 12 రోజులపాటు నిర్వహించే మంజీరా (గరుడగంగ) కుంభమేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ, పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంజీర నదికి చేరుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, మహారెడ్డి భూపాల్రెడ్డి, జిల్లా సహకార, మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పంచవటి పీఠాధిపతి కాశీనాథ బాబా పూజలు నిర్వహించారు. బోనాలు తలపై పెట్టుకుని మహిళలు తరలివస్తుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం వేళల్లో పూజారులు మంజీర నదికి గంగా హారతి నిర్వహించారు. 12 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో మొదటి రోజున మంచి సంఖ్యలో నాగ సాధువులు పూజల్లో పాల్గొన్నారు.
Read Also: PM Modi: కేరళలో తొలి వందే భారత్.. నేడు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోడీ
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
మంజీరా నది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక మీదుగా ప్రవహించి గౌడ్గావ్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించి ప్రవహిస్తుంది. మంజీరా నదికి దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా 2010లో పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో కుంభమేళా నిర్వహించారు. ఆ తర్వాత 2013, 2018లో కుంభమేళా ఘనంగా జరిగింది. ఈసారి మళ్లీ.. ఏప్రిల్ 24 నుంచి మే 5వ తేదీ వరకు నాలుగో సారి మళ్లీ కుంభమేళా నిర్వహించనున్నారు. తెలంగాణలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవాపూర్ పంచవటి క్షేత్రంలో మంజీరా కుంభమేళాను ఘనంగా నిర్వహిస్తారు. ఈ మేళాకు నాగసాధువులు, సాధుసంతులు, భక్తులకు పెద్ద ఎత్తున తరలివస్తారు. భక్తులకు అన్నదానం చేసేందుకు ప్రత్యేక షెడ్లు సిద్ధం చేశారు. భక్తులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!