Manjeera Kumbh Mela: మంజీరా నది కుంభమేళా షురూ.. 12 రోజుల పాటు మహావేడుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manjeera Kumbh Mela: మన దేశంలో నదులను కూడా దేవతలుగా పూజిస్తారు. అందుకే పన్నెండేళ్ల కోసారి పుష్కరాల పేరుతో ఘనంగా వేడుకలను నిర్వహించి.. నదీమ తల్లిని పూజిస్తారు. పుష్కరాలతో పాటు కుంభమేళాను కూడా నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా కుంభమేళా సోమవారం ప్రారంభమైంది. న్యాల్కల్ మండలం రాఘవాపూర్-చాల్కి గ్రామాల మధ్య మంజీరా నది ఒడ్డున 12 రోజులపాటు నిర్వహించే మంజీరా (గరుడగంగ) కుంభమేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ, పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంజీర నదికి చేరుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, మహారెడ్డి భూపాల్రెడ్డి, జిల్లా సహకార, మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పంచవటి పీఠాధిపతి కాశీనాథ బాబా పూజలు నిర్వహించారు. బోనాలు తలపై పెట్టుకుని మహిళలు తరలివస్తుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం వేళల్లో పూజారులు మంజీర నదికి గంగా హారతి నిర్వహించారు. 12 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో మొదటి రోజున మంచి సంఖ్యలో నాగ సాధువులు పూజల్లో పాల్గొన్నారు.
Read Also: PM Modi: కేరళలో తొలి వందే భారత్.. నేడు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోడీ
Also Read
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
మంజీరా నది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక మీదుగా ప్రవహించి గౌడ్గావ్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించి ప్రవహిస్తుంది. మంజీరా నదికి దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా 2010లో పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో కుంభమేళా నిర్వహించారు. ఆ తర్వాత 2013, 2018లో కుంభమేళా ఘనంగా జరిగింది. ఈసారి మళ్లీ.. ఏప్రిల్ 24 నుంచి మే 5వ తేదీ వరకు నాలుగో సారి మళ్లీ కుంభమేళా నిర్వహించనున్నారు. తెలంగాణలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవాపూర్ పంచవటి క్షేత్రంలో మంజీరా కుంభమేళాను ఘనంగా నిర్వహిస్తారు. ఈ మేళాకు నాగసాధువులు, సాధుసంతులు, భక్తులకు పెద్ద ఎత్తున తరలివస్తారు. భక్తులకు అన్నదానం చేసేందుకు ప్రత్యేక షెడ్లు సిద్ధం చేశారు. భక్తులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
-
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
-
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!