Crime News: 11 ఏళ్ల బాలుడి గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని డ్రమ్లో దాచిన నిందితుడు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సిద్ధార్థ్ నగర్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుండగుడు బాలుడి గొంతును ఓ పదునైన ఆయుధంతో కోసి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే ఉన్న బ్లూ కలర్ డ్రమ్లో దాచిపెట్టి బయట నుంచి తాళం వేసి పరారయ్యాడు.
మృతుడు శివరాజ్ అలియాస్ బాదల్ రజక్ (11) 5వ తరగతి చదువుతున్న విద్యార్థి. అతని తల్లి ఆశా రజక్ గృహ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సోమవారం ఆమె, పెద్ద కుమారుడు పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు బయట నుంచి తాళం వేసి ఉండటం అనుమానం కలిగించింది. బాలుడు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read
2 States Elections: నేటితో బెంగాల్, తమిళనాడులో ముగియనున్న ప్రచారం.. ఎల్లుండి ఓటింగ్
పోలీసులు వచ్చి తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లగా గదిలో రక్తపు మరకలు కనిపించాయి. అనుమానం రావడంతో ఇంట్లో ఉన్న నీలి డ్రమ్ను తెరిచి చూడగా, అందులో బాదల్ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. అతని గొంతుపై పలు సార్లు పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన వెనుక మథురా అనే వ్యక్తి ఉన్నాడని మృతుడి అక్క సెజల్ రజక్ ఆరోపించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి వారి తల్లిని బలవంతంగా వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడని, కుటుంబం నిరాకరించడంతో తరచూ బెదిరింపులకు దిగేవాడని తెలిపింది. “పెళ్లి చేయకపోతే పిల్లలను చంపేస్తా” అని కూడా పలుమార్లు హెచ్చరించాడని ఆమె పేర్కొంది.
ఘటన సమయంలో బాదల్ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని ఉపయోగించుకుని నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లగా అక్కడ కూడా తాళం వేసి ఉండటం, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఈ కేసుపై జిలా ఎస్పీ అధికారి శివేశ్ సింగ్ బఘేల్ మాట్లాడుతూ.. “11 ఏళ్ల బాలుడు కనిపించడంలేదని సమాచారం అందింది. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా డ్రమ్లో మృతదేహం లభించింది. ఇది హత్య కేసు అని ప్రాథమికంగా నిర్ధారించాం. కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా అనుమానితులను గుర్తించాం. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి” అని తెలిపారు.
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
ఆ తర్వాత ఘటనాస్థలానికి ఫోరెన్సిక్ బృందం, ఫింగర్ ప్రింట్ నిపుణులు చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన ఓ పదునైన కోయు ఆయుధంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నుంచి ఈ కుటుంబం ఆ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు పిల్లల్లో బాదల్ చిన్నవాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?