Crime News: 11 ఏళ్ల బాలుడి గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని డ్రమ్లో దాచిన నిందితుడు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సిద్ధార్థ్ నగర్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుండగుడు బాలుడి గొంతును ఓ పదునైన ఆయుధంతో కోసి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే ఉన్న బ్లూ కలర్ డ్రమ్లో దాచిపెట్టి బయట నుంచి తాళం వేసి పరారయ్యాడు.
మృతుడు శివరాజ్ అలియాస్ బాదల్ రజక్ (11) 5వ తరగతి చదువుతున్న విద్యార్థి. అతని తల్లి ఆశా రజక్ గృహ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సోమవారం ఆమె, పెద్ద కుమారుడు పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు బయట నుంచి తాళం వేసి ఉండటం అనుమానం కలిగించింది. బాలుడు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
2 States Elections: నేటితో బెంగాల్, తమిళనాడులో ముగియనున్న ప్రచారం.. ఎల్లుండి ఓటింగ్
పోలీసులు వచ్చి తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లగా గదిలో రక్తపు మరకలు కనిపించాయి. అనుమానం రావడంతో ఇంట్లో ఉన్న నీలి డ్రమ్ను తెరిచి చూడగా, అందులో బాదల్ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. అతని గొంతుపై పలు సార్లు పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన వెనుక మథురా అనే వ్యక్తి ఉన్నాడని మృతుడి అక్క సెజల్ రజక్ ఆరోపించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి వారి తల్లిని బలవంతంగా వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడని, కుటుంబం నిరాకరించడంతో తరచూ బెదిరింపులకు దిగేవాడని తెలిపింది. “పెళ్లి చేయకపోతే పిల్లలను చంపేస్తా” అని కూడా పలుమార్లు హెచ్చరించాడని ఆమె పేర్కొంది.
ఘటన సమయంలో బాదల్ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని ఉపయోగించుకుని నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లగా అక్కడ కూడా తాళం వేసి ఉండటం, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఈ కేసుపై జిలా ఎస్పీ అధికారి శివేశ్ సింగ్ బఘేల్ మాట్లాడుతూ.. “11 ఏళ్ల బాలుడు కనిపించడంలేదని సమాచారం అందింది. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా డ్రమ్లో మృతదేహం లభించింది. ఇది హత్య కేసు అని ప్రాథమికంగా నిర్ధారించాం. కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా అనుమానితులను గుర్తించాం. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి” అని తెలిపారు.
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
ఆ తర్వాత ఘటనాస్థలానికి ఫోరెన్సిక్ బృందం, ఫింగర్ ప్రింట్ నిపుణులు చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన ఓ పదునైన కోయు ఆయుధంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నుంచి ఈ కుటుంబం ఆ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు పిల్లల్లో బాదల్ చిన్నవాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..