Board Exams: ఏడాదిలో రెండుసార్లు 10, 12వ బోర్డు పరీక్షలు!
PM SHRI Scheme in Chhattisgarh: ఛత్తీస్గఢ్లో పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని పండిట్ దీన్ దయాళ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం విష్ణుదేవ్ సాయితో పాటు విద్యాశాఖ అధికారులు, ఛత్తీస్గఢ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ పాల్గొన్నారు. పీఎంశ్రీ ఆరంభం సందర్భంగా 10, 12 తరగతుల విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శుభవార్త చెప్పారు.
ఛత్తీస్గఢ్లో 10, 12వ బోర్డు పరీక్షలకు సంవత్సరంలో రెండుసార్లు హాజరయ్యే అవకాశాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి కల్పించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులు రెండుసార్లు పరీక్షలు రాసి.. మెరుగైన స్కోరును ఉంచుకుని, మరో దానిని రద్దు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులపై విద్యా సంబంధిత ఒత్తిడిని తగ్గించడం ఇది ఒకటి అని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం 2020ను లక్ష్యాలను ఆయన వివరించారు.
Also Read
- Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
ప్రధానమంత్రి శ్రీ యోజన కింద దేశవ్యాప్తంగా 14500 ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చేయడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ పథకం కింద ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 211 పాఠశాలలు మరియు కేంద్రీయ విద్యాలయానికి చెందిన 17 పాఠశాలలు చేర్చబడ్డాయి. కాదు, నవోదయ విద్యాలయానికి చెందిన 20 పాఠశాలలు కూడా ఈ పథకంలో చేర్చబడ్డాయి. ఛత్తీస్గఢ్లో మొత్తం 248 పాఠశాలలు ప్రధానమంత్రి శ్రీ యోజన కింద ఎంపికయ్యాయి.
Also Read: Sarfaraz Khan: ప్రాక్టీస్ కోసం 16 వేల కిలోమీటర్లు.. ప్రతి రోజూ 500 బంతులు!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ… ‘2025-26 అకడమిక్ సెషన్ నుండి 10, 12వ తరగతి విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్ రాసేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. నూతన విద్యా విధానంలో ఆవిష్కరణలకు పెద్దపీట వేశాం. పిల్లలను పరీక్షల ఒత్తిడి నుంచి విముక్తి చేయడమే మా తొలి లక్ష్యం. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా పిల్లలను భవిష్యత్తుకు సిద్ధం చేయడమే పిఎంశ్రీ లక్ష్యం’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
-
Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!