Board Exams: ఏడాదిలో రెండుసార్లు 10, 12వ బోర్డు పరీక్షలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM SHRI Scheme in Chhattisgarh: ఛత్తీస్గఢ్లో పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని పండిట్ దీన్ దయాళ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం విష్ణుదేవ్ సాయితో పాటు విద్యాశాఖ అధికారులు, ఛత్తీస్గఢ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ పాల్గొన్నారు. పీఎంశ్రీ ఆరంభం సందర్భంగా 10, 12 తరగతుల విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శుభవార్త చెప్పారు.
ఛత్తీస్గఢ్లో 10, 12వ బోర్డు పరీక్షలకు సంవత్సరంలో రెండుసార్లు హాజరయ్యే అవకాశాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి కల్పించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులు రెండుసార్లు పరీక్షలు రాసి.. మెరుగైన స్కోరును ఉంచుకుని, మరో దానిని రద్దు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులపై విద్యా సంబంధిత ఒత్తిడిని తగ్గించడం ఇది ఒకటి అని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం 2020ను లక్ష్యాలను ఆయన వివరించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి శ్రీ యోజన కింద దేశవ్యాప్తంగా 14500 ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చేయడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ పథకం కింద ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 211 పాఠశాలలు మరియు కేంద్రీయ విద్యాలయానికి చెందిన 17 పాఠశాలలు చేర్చబడ్డాయి. కాదు, నవోదయ విద్యాలయానికి చెందిన 20 పాఠశాలలు కూడా ఈ పథకంలో చేర్చబడ్డాయి. ఛత్తీస్గఢ్లో మొత్తం 248 పాఠశాలలు ప్రధానమంత్రి శ్రీ యోజన కింద ఎంపికయ్యాయి.
Also Read: Sarfaraz Khan: ప్రాక్టీస్ కోసం 16 వేల కిలోమీటర్లు.. ప్రతి రోజూ 500 బంతులు!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ… ‘2025-26 అకడమిక్ సెషన్ నుండి 10, 12వ తరగతి విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్ రాసేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. నూతన విద్యా విధానంలో ఆవిష్కరణలకు పెద్దపీట వేశాం. పిల్లలను పరీక్షల ఒత్తిడి నుంచి విముక్తి చేయడమే మా తొలి లక్ష్యం. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా పిల్లలను భవిష్యత్తుకు సిద్ధం చేయడమే పిఎంశ్రీ లక్ష్యం’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!