Mobile Connections: దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్.. 45 లక్షల ఫేక్ కాల్స్ బ్లాక్
- దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్..
- 45 లక్షల ఫేక్ కాల్స్ బ్లాక్.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాధనాలను ఉపయోగించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Connections: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాధనాలను ఉపయోగించి ఇప్పటివరకు 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసినట్లు కేంద్ర సమాచార శాఖ తెలిపింది. దీని కింద నకిలీ పత్రాలు ఉపయోగించిన మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేయబడ్డాయి. దీనితో పాటు 45 లక్షలకు పైగా ఫేక్ కాల్స్ కూడా బ్లాక్ అయినట్లు సమాచారం. ఈ చర్య మోసం, సైబర్ నేరాలను అరికట్టడంలో సహాయపడుతుంది. అలాగే దేశ ప్రజల భద్రతకు భరోసా ఇస్తుంది. ఈ విషయంలో మరింత సమాచారం ఇస్తూ, నాలుగు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSP) టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ (DOT) సహకారంతో అధునాతన వ్యవస్థను విజయవంతంగా అమలు చేశారని కేంద్ర సమాచార శాఖ తెలిపింది. దీని కింద ఇప్పటివరకు 45 లక్షల ఫేక్ ఇంటర్నేషనల్ కాల్స్ ఇండియన్ టెలికాం నెట్వర్క్లోకి రాకుండా నిలిపివేశారు. అలాగే, తదుపరి దశలో కేంద్రీకృత వ్యవస్థ ఉంటుంది. ఇది అన్ని TSPలలో మిగిలిన నకిలీ కాల్లను తొలగిస్తుంది. ఇది త్వరలో అమలులోకి రానుంది.
PM Modi: మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
దీనితో పాటు, టెలికమ్యూనికేషన్స్ విభాగం అధునాతన వ్యవస్థను ప్రారంభించిందని కూడా తెలిపింది. దీని కింద, భారతీయ టెలికాం వినియోగదారులకు చేరేలోపు అంతర్జాతీయ నకిలీ కాల్ లను గుర్తించి బ్లాక్ చేయడానికి ఇది సిద్ధం చేయబడింది. ఈ వ్యవస్థను రెండు దశల్లో అమలు చేస్తున్నారు. మొదటి దశ TSP స్థాయిలో అమలు చేయబడుతోంది. దీని కింద, కస్టమర్ల ఫోన్ నంబర్ల నుండి వచ్చే ఫేక్ కాల్లను ఆపవచ్చు. రెండో దశను కేంద్ర స్థాయిలో అమలు చేస్తున్నారు. ఇందులో, ఇతర TSPల కస్టమర్ల ఫోన్ నంబర్ల నుండి వచ్చే నకిలీ కాల్ లను ఆపవచ్చు. దేశంలోని సైబర్ క్రైమ్ హాట్స్పాట్లు లేదా జిల్లాలలో 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్లపై అణిచివేతలో భాగంగా కేంద్రం ఏకంగా 33.48 లక్షల మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసింది. అలాగే సైబర్ నేరగాళ్లు ఉపయోగించే 49,930 మొబైల్ హ్యాండ్సెట్ లను కూడా బ్లాక్ చేసింది.
ఒక వ్యక్తికి నిర్దేశించిన పరిమితిని మించిన 77.61 లక్షల మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేయబడ్డాయి. అలాగే సైబర్ నేరాలు లేదా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన 2.29 లక్షల మొబైల్ ఫోన్లు కూడా బ్లాక్ చేయబడ్డాయి. ఇది కాకుండా దొంగిలించిన, పోగొట్టుకున్న 21.03 లక్షల మొబైల్ ఫోన్లలో సుమారు 12.02 లక్షల మందిని గుర్తించారు. దీనితో పాటు DOT, TSP SMS పంపడంలో పాల్గొన్న దాదాపు 20,000 ఎంటిటీలు, 32,000 SMS హెడర్లు, 2 లక్షల SMS టెంప్లేట్ లను కట్ చేశాయి. ఇక నకిలీ పత్రాల ఆధారంగా తీసిన డిస్కనెక్ట్ చేయబడిన మొబైల్ కనెక్షన్లతో అనుసంధానించబడిన దాదాపు 11 లక్షల ఖాతాలను బ్యాంకులు, చెల్లింపు వాలెట్లు స్తంభింపజేశాయని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మరోవైపు నకిలీ పత్రాల ఆధారంగా డిస్కనెక్ట్ చేయబడిన మొబైల్ కనెక్షన్లకు లింక్ చేయబడిన దాదాపు 11 లక్షల వాట్సాప్ ఖాతాలను వాట్సప్ మూసివేసింది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!