Zoho’s Sridhar Vembu: “20 ఏళ్ల లోపే పిల్లల్ని కనండి”.. ఉపాసన పోస్ట్కు జోహో శ్రీధర్ రెస్పాన్స్..
- "20 ఏళ్ల లోపే పిల్లల్ని కనండి"..
- ఉపాసన పోస్ట్కు జోహో శ్రీధర్ రెస్పాన్స్..
- నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన..
Zoho’s Sridhar Vembu: జోహో సహ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. యువతకు ఆయన పెళ్లి గురించి సూచిస్తూ.. ‘‘ పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లల్ని కనండి’’ అని సలహా ఇచ్చారు. యువకులు సమాజానికి, మన పూర్వికుల పట్ల వారి జనాభా విధిని నేరవేర్చడానికి వివాహం చేసుకోవాలని ఆయన చెప్పారు. నేను కలిసే యువ పారిశ్రామికవేత్తలకు, పురుషులకు, మహిళలకు ఇదే లసహా ఇస్తున్నానని వెంబు తన ఎక్స్లో రాశారు. ఈ భావన వింతగా లేదా పాతకాలం నాటిదిగా అనిపించవచ్చు. కానీ ఈ ఆలోచనలు మళ్లీ ప్రతిధ్వనిస్తాయని తాను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని ఆయన అన్నారు.
నటుడు రామ్చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల సోషల్ మీడియా పోస్ట్కు రిప్లైగా వెంబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉపాసన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో మాట్లాడిన అనుభవాలను పంచుకున్నారు. ఎవరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు..? అని ఆమె ప్రశ్నించగా.. ఎక్కువ మంది అబ్బాయిలు ఎక్కువగా చేతులు పెకెత్తారు. దీంతో అమ్మాయిలు కెరీర్పై ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆమె అన్నారు. దీనికి ప్రతిస్పందనగా వెంబు.. యువత 20 ఏళ్ల లోపే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలని సూచించారు.
Also Read
Read Also: Chelluboyina Venu: కులాన్ని.. కులంలోని కొందరిని తిట్టడానికే వన భోజనాలను అడ్డం పెట్టుకున్నారు..
వెంబు వ్యాఖ్యలపై యువత మిశ్రమంగా స్పందించారు. చిన్న వయసులోనే వివాహం, కుటుంబ ఏర్పాటుకు నిజమైన అడ్డంకి సాంస్కృతిక సంకోచం కాదు, ఆర్థిక ఒత్తిడి అని ఒక యూజర్ అన్నారు. అస్థిరమైన ఆదాయాలు, తీవ్రమైన పనిగంటలు, ఆదాయంతో గణనీయమైన వాటా అద్దెలకు వెళ్తుందని అతను చెప్పాడు. ఇది జనాభా సంక్షోభం కాదని, ఆర్థిక సంక్షోభం అని మరో యూజర్ అన్నారు. దీనికి వెంబూ ప్రతిస్పందిస్తూ.. ‘‘భరించగలిగే వ్యక్తులు కూడా వివాహం చేసుకోవడం లేదని, పిల్లల్ని కనడం లేదని’’ ఆయన అన్నారు. ఒక మహిళ.. ‘‘నేను అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలను కనడానికి ఇష్టపడతాను. కానీ అది మాత్రమే నా జీవితంలో ఏకైక లక్ష్యం కాదు’’ అని రాసింది. దీనికి వెంబు స్పందిస్తూ.. ఏ వయసులోనైనా రాణించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అన్నారు. 28 ఏళ్ల వయసులో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ, తిరిగి నిర్మించుకోవడానికి చాలా సమయం ఉందని చెప్పారు. లారీ ఎల్లిసన్ తన ప్రయాణాన్ని 31 ఏళ్ల వయసులో ప్రారంభించారని గుర్తు చేశారు.
57 ఏళ్ల శ్రీధర్ వెంబు 1990ల చివరలో ప్రమీల శ్రీనివాసన్ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరు అమెరికాలో ఉన్నారు. 2020లో శ్రీనివాసన్ విడాకుల కోరారు. 2020లో వెంబు తమిళనాడుకు వెళ్లిన తర్వాత వివాహాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు వాట్సాప్ ద్వారా తనకు తెలియజేశాడని ఆమె ఆరోపించింది. తన అనుమతి లేకుండా జోహోలోని వాటాలను తన సోదరి, బంధువులకు బదిలీ చేశారని ఆమె పేర్కొంది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!