Fake PMO Officer: ప్రధాని కార్యాలయ అధికారినంటూ ఫోజ్.. జెడ్ ఫ్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ఫ్రూప్ కార్లతో దర్జా.. చివరకు దొరికిందిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake PMO Officer: ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంఓ) అధికారినంటూ గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగాన్నే బురిడి కొట్టించాడు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతూ.. స్టార్ హోటళ్లలో బస చేస్తూ సకలభోగాలను అనుభవించాడు. ఇదిలా ఉంటే సరిహద్దులోని సున్నిత ప్రాంతాలను పర్యటించాడు. ఆయనకు భద్రత కల్పిస్తున్న సిబ్బందితో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. అయితే చివరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు పట్టుబడ్డాడు.
మొత్తం అధికార యంత్రాంగాన్ని చీట్ చేసిన వ్యక్తి పేరు కిరణ్ భాయ్ పటేల్. పీఎంఓలో అడిషనల్ డైరెక్టర్ అని తనను తాను జమ్మూ కాశ్మీర్ అధికారులకు పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో అక్కడి బీజేపీ కార్యకర్తలను, నాయకులను కలిశాడు. దూద్ పత్రి, గుల్ మార్గ్, దాల్ సరస్సుతో సహా పలు ప్రదేశాల్లో అత్యున్నత భద్రతా సిబ్బంది మధ్య వీఐపీ ట్రీట్మెంట్ ను పొందాడు. దానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుండే వాడు.
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
Read Also: Delhi Liquor Case: మనీష్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు..
అయితే రెండు వారాల వ్యవధిలో మరోసారి జమ్మూ కాశ్మీర్ కు కిరణ్ భాయ్ పటేల్ వెల్లడంతో అనుమానించిన అధికారులు, ఆరా తీయగా గుట్టురట్టైంది. అతడి గత చరిత్ర గురించి ఆరా తీయగా విస్తూపోయే నిజాలు వెలుగులోకి రావడంతో అధికారులు అవాక్కయ్యారు. మార్చి 2న నకిలీ పీఎంఓ అధికారిగా నటిస్తున్న వ్యక్తి గురించి జమ్మూ కాశ్మీర్ సీఐడీ విభాగానికి సమాచారం రావడంతో అప్రమత్తం అయ్యారు. కిరణ్ భాయ్ బస చేస్తున్న లలిత్ హోటల్ కు ఓ టీంను పంపి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు శ్రీనగర్ లోని నిషాత్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరిపారు. విచారణ నిజాన్ని ఒప్పుకున్నాడు కిరణ్ భాయ్. అతడి దగ్గర నుంచి 10 నకిలీ విజిటింగ్ కార్డులు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన భార్యతో కలిసి అహ్మదాబాద్ ఘెడసర్ లో నివసిస్తున్నాడు. ఇతడిపై అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ విచారిస్తున్నాయి. గుజరాత్ లో ఇతడిపై పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు అయ్యాయి.
తాజావార్తలు
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!