Viral: మొత్తం రూ.1 నాణాలే.. రూ.2.6 లక్షల బైక్ కొనేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంపాదన విలువ తెలియాలంటే రూపాయి.. రూపాయి కూడబెట్టాలి అని చెబుతుంటారు పెద్దలు.. ఓ యువకుడిని చూస్తే అది నిజమేగా అనాల్సిందే.. విషయం ఏదైనా సరే.. దాని వెనుక కృషిని బట్టే ఫలితం ఉంటుంది.. ఆ యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది… అత్యంత ఖరీదైన బైక్ను మొత్తం రూ.1 నాణాలతో కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు ఆ యువకుడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలంలో భూబాతీ అనే యువకుడు బైక్ కొనాలని అనుకున్నాడు.. మూడేళ్ల క్రితం బైక్ కొనుగోలు చేసేందుకు షోరూమ్కు వెళ్లి అడిగితే.. అతడికి నచ్చిన బైక్ ఖరీదు.. రూ.2 లక్షలుగా చెప్పారు.. అప్పుడు అతని దగ్గర అంత మొత్తం లేదు.. కానీ, అప్పటి నుంచే.. ఏది చేసినా.. తన బైక్ కోసమే అన్నట్టుగా.. రూపాయి నాణేలు సేకరించడం మొదలు పెట్టాడు.. ఇప్పుడు సుమారు 2.6 లక్షల రూపాయి నాణేలతో తన డ్రీమ్ బైక్ని కొనుగోలు చేసి ఔరా..! అనిపించాడు.
Read Also: CBI: అక్రమాస్తుల కేసు.. కాంగ్రెస్ నేతకు మూడేళ్ల జైలు..
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
అమ్మపేటలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న భూబతి.. బీసీఏ గ్రాడ్యుయేట్ చేశాడు.. కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. తన రెగ్యులర్ ఉద్యోగంతో పాటు, యూట్యూబ్లో కొన్ని వీడియోలను కూడా చేస్తుంటాడు.. మూడేళ్ల క్రితం తనకు నచ్చిన బైక్ ధర గురించి వాకాబు చేస్తే రూ.2 లక్షలని సదరు వ్యక్తి చెప్పాడు. అయితే అప్పట్లో బైక్ కొనేంత మొత్తం అతని వద్ద లేదు. అయినప్పటికీ, అతని కోరిక తీరలేదు, ఆ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి ప్రతీ పైసను పొదుపు చేయడం ప్రారంభించాడు.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా సంపాదించిన ఆదాయం నుండి డబ్బును ఆదా చేయాలని నిర్ణయించుకున్నాను. బైక్ ఖరీదు గురించి ఇటీవల ఆరా తీయగా ఇప్పుడు ఆన్ రోడ్ రూ.2.6 లక్షలు అని తెలిసింది.. ఈసారి నా దగ్గర మొత్తం ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు భూపతి.. ఇక, శనివారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి మినీ వ్యాన్లో గోనె సంచులతో నాణేలను బజాజ్ షోరూమ్కి తీసుకొచ్చాడు భూపతి.. ఆ మోటార్ సైకిల్ షోరూం సిబ్బందికి ఆ నాణేలను లెక్కించేందుకు సుమారు 10 గంటల సమయం పట్టిందని భారత్ ఏజెన్సీ మేనేజర్ మహావిక్రాంత్ వెల్లడించారు.. ఇలానే ఇటీవల ఒక వృద్ధుడు తన డ్రీమ్ కారును కొనుక్కునేందుకు తన పెన్షని వెచ్చించి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.. కాగా, ఇప్పుడు భూపతి.. రూపాయి నాణేలతో రూ. 2.6 లక్షల విలువైన బజాజ్ డోమినార్ 400సీసీ బైక్ కొనుగోలు చేసి వార్తలకు ఎక్కాడు.. తొలుత షోరూమ్ సిబ్బంది నాణేలను తీసుకోవడానికి ఇష్టపడలేదని.. తర్వాత భూబతి తన స్నేహితులు మరియు సిబ్బందితో కలిసి నాణేలను లెక్కించారు, దీనికి మొత్తంగా 10 గంటల సమయం పట్టినట్టు చెబుతున్నారు.. మీడియా కథనాల ప్రకారం, భూబతి దేవాలయాలు, హోటళ్ళు మరియు టీ షాపులను సందర్శించడం ద్వారా తన నోట్లను మార్చుకున్నాడట.. నోట్లను నాణేలుగా మార్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెబుతున్నాడు..
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!