Karnataka: రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య.. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఫైర్
- రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య
- మత కోణంలోనే హత్య జరిగిందని నెటిజన్లు ట్వీట్లు
- కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిందంటూ బీజేపీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ నర్సు దారుణ హత్య కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లవ్ జీహాద్ పేరుతో యువతిని ట్రాప్ చేసి.. మోజు తీరాక నిందితుడు అంతమొందించాడంటూ బీజేపీ ధ్వజమెత్తుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నర్సు హత్యకు గురైందని మండిపడుతోంది.
హవేరి జిల్లా మసూర్ గ్రామానికి చెందిన యువ నర్సు స్వాతి రమేష్ బ్యాడ్గి.. రాణేబెన్నూర్ పట్టణంలో నర్సుగా పనిచేస్తోంది. నయాజ్ అనే యువకుడు.. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అయితే ఇటీవల నయాజ్కు వేరే సంబంధం కుదిరింది. అంతే స్వాతిని వదిలించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఇది కూడా చదవండి: Railway Bridge: అనకాపల్లిలో లారీ బీభత్సం.. కుంగిన వంతెన, తప్పిన పెను ప్రమాదం!
మాట్లాడాలంటూ స్వాతిని నయాజ్ పిలిచాడు. నయాజ్.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాణేబెన్నూర్లోని స్వర్ణ పార్క్కు వచ్చాడు. ఆమె కూడా స్వర్ణ పార్క్ వచ్చింది. అనంతరం అక్కడ నుంచి రట్టిహళ్లిలోని ఓ పాడుబడిన పాఠశాలకు తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని తుంగభద్ర నదిలో పడేశారు.
అయితే మార్చి 3న స్వాతి తప్పిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు గాలించగా.. మార్చి 6న తుంగభద్ర నదిలో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి పోస్టుమార్గం నిర్వహించగా.. గొంతు కోసి చంపినట్లుగా తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నయాజ్ను అరెస్ట్ చేశారు. తాజాగా అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులు వినయ్, దర్గాచారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దలు కుదిర్చిన వివాహానికి స్వాతి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో నయాజ్ చంపినట్లుగా పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ
అయితే ఈ వ్యవహారం తాజాగా రాజకీయ దుమారం రేపుతోంది. మతాంతర హత్యలను అరికట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ఈ హత్యను ఖండిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ హత్య మనసులను కలత పెట్టేస్తోందని వ్యాఖ్యానించారు. స్వాతి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు.. త్వరతగతిన దర్యాప్తు పూర్తి చేయాలని కోరారు.

తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!