Karnataka: రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య.. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఫైర్
- రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య
- మత కోణంలోనే హత్య జరిగిందని నెటిజన్లు ట్వీట్లు
- కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిందంటూ బీజేపీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ నర్సు దారుణ హత్య కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లవ్ జీహాద్ పేరుతో యువతిని ట్రాప్ చేసి.. మోజు తీరాక నిందితుడు అంతమొందించాడంటూ బీజేపీ ధ్వజమెత్తుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నర్సు హత్యకు గురైందని మండిపడుతోంది.
హవేరి జిల్లా మసూర్ గ్రామానికి చెందిన యువ నర్సు స్వాతి రమేష్ బ్యాడ్గి.. రాణేబెన్నూర్ పట్టణంలో నర్సుగా పనిచేస్తోంది. నయాజ్ అనే యువకుడు.. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అయితే ఇటీవల నయాజ్కు వేరే సంబంధం కుదిరింది. అంతే స్వాతిని వదిలించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
Also Read
ఇది కూడా చదవండి: Railway Bridge: అనకాపల్లిలో లారీ బీభత్సం.. కుంగిన వంతెన, తప్పిన పెను ప్రమాదం!
మాట్లాడాలంటూ స్వాతిని నయాజ్ పిలిచాడు. నయాజ్.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాణేబెన్నూర్లోని స్వర్ణ పార్క్కు వచ్చాడు. ఆమె కూడా స్వర్ణ పార్క్ వచ్చింది. అనంతరం అక్కడ నుంచి రట్టిహళ్లిలోని ఓ పాడుబడిన పాఠశాలకు తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని తుంగభద్ర నదిలో పడేశారు.
అయితే మార్చి 3న స్వాతి తప్పిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు గాలించగా.. మార్చి 6న తుంగభద్ర నదిలో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి పోస్టుమార్గం నిర్వహించగా.. గొంతు కోసి చంపినట్లుగా తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నయాజ్ను అరెస్ట్ చేశారు. తాజాగా అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులు వినయ్, దర్గాచారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దలు కుదిర్చిన వివాహానికి స్వాతి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో నయాజ్ చంపినట్లుగా పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ
అయితే ఈ వ్యవహారం తాజాగా రాజకీయ దుమారం రేపుతోంది. మతాంతర హత్యలను అరికట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ఈ హత్యను ఖండిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ హత్య మనసులను కలత పెట్టేస్తోందని వ్యాఖ్యానించారు. స్వాతి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు.. త్వరతగతిన దర్యాప్తు పూర్తి చేయాలని కోరారు.

తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!