Delhi: బతికే ఛాన్స్ లేదు.. ఏడు నెలలుగా కోమాలోనే మహిళ.. అయినా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman in coma for 7 months gives birth to baby girl: ఏడు నెలలుగా కోమాలో ఉండీ.. ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఢిల్లీలోన ఎయిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వైద్యశాస్త్రంలోనే అత్యంత అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఓ ప్రమాదం కారణంగా తలకు తీవ్రగాయాలు అయిన మహిళ గత ఏడు నెలల నుంచి ఎయిమ్స్ లోని ట్రామా సెంటర్లో కోమాలోనే ఉంది. ప్రమాదం జరిగే సమయానికి మహిళ గర్భవతి. అయితే వైద్యులు సదరు మహిళ పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుని గర్భంలో శిశువు ఎదిగేలా చికిత్స కొనసాగించారు. దీంతో ఏడు నెలల తర్వాత మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
Read Also: Bhatti Vikramarka: బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నాయి
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
బులంద్ షహర్ కు చెందిన 23 ఏళ్ల షఫియా అనే మహిళ ఓ ప్రమాదంలో గాయపడింది. తలకు తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లింది. ఏప్రిల్ 1న చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరింది. అప్పటికే షఫియా 40 రోజుల గర్భవతి. ఇప్పటికే ఆమెకు నాలుగు సార్లు న్యూరో సర్జికల్ ఆపరేషన్లు చేశారు వైద్యులు. ఆమె 18 వారాల గర్భిణిగా ఉన్నప్పుడు ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేసిన తర్వాత గర్భంలో శిశువు ఆరోగ్యం ఉన్నట్లు నిర్థారించారు. ప్రస్తుతం మహిళ ఇంకా కోమాలోనే ఉందని.. ఆమె బతికే అవకాశాలు కేవలం 10-15 శాతం మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ముందుగా మహిళ గర్భాన్ని ఉంచాలా..? వద్దా..? అనే దానిపై చర్చించామని.. అయితే గర్భంలో ఉన్న శిశువు హెల్తీగా ఉండటంతో వైద్యులు, కుటుంబ సభ్యులు గర్భం కొనసాగించేందుకే మొగ్గు చూపాలరు. ముందుగా తల్లి ఆరోగ్యం దృష్ట్యా గర్భం కొనసాగించే విషయాన్ని కుటుంబ సభ్యులకే వదిలేశారు వైద్యులు. అయితే గర్భం కొనసాగించేందుకే కుటుంబీకులు మొగ్గు చూపారు. అక్టోబర్ 22న మహిళ, ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఇది చాలా అసాధారణం అని.. ఎయిమ్స్ లో 22 ఏళ్ల న్యూరో సర్జికల్ కెరీర్లో నేను ఇలాంటి కేసును చూడలేదని డాక్టర్ దీపక్ గుప్తా అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!