Live In Relation: కేరళ శ్రద్ధా వాకర్గా సింధు.. యువతిని నరికి చంపిన లవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman hacked to death in public by partner in Kerala: లివ్ ఇన్ రిలేషన్ షిప్ మహిళల ప్రాణాలను తీస్తోంది. నమ్ముకున్నవారే నరికి చంపుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ ఉదంతమే. తాజాగా కేరళలో కూడా శ్రద్ధావాకర్ తరహాలోనే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న యువతిని ఆమె లవర్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురం శివార్లలోని వజ్హయిల సమీపంలో ఈ ఘటన జరిగింది.
Read Also: Bollywood: చిచ్చు రాజేసిన కాంతారా, పుష్ప కామెంట్స్.. స్టార్ డైరెక్టర్ల మధ్య ట్వీట్ వార్
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
వివరాల్లోకి వెళితే బాధితురాలు సింధు, నిందితుడు రాగేష్ సహజీవనం చేస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సింధు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైక్ పై వచ్చిన రాగేష్ కొడవలితో బహిరంగంగా నరికి చంపాడు. మొదటగా రాగేష్, సింధు మెడపై దాడి చేశాడు. ఈ దాడినుంచి కాపాడాలని కేకలు వేయడంతో, ఆమె తలపై దాడి చేశాడు. దీంతో సింధు అక్కడే కుప్పకూలిపోయింది. తీవ్రగాయాలో రక్తపు మడుగులో ఉన్న సింధుపై విచక్షణరహితంగా దాడి చేశాడు.
ఈ ఘటనను చూసిన స్థానికులు నిందితుడిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాల పాలైన సింధు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించింది. బాధితురాలు సింధు పలోడ్ సమీపంలోని నన్నిమోడుకు చెందిన వ్యక్తి కాగా.. నిందితుడు రాగేష్ కిలిమనూర్ కు చెందిన వాడు. వీరిద్దరికి కుటుంబాలు ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సింధు తనకు దూరం అవుతుందనే అనుమానంతోనే రాగేష్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?