Mumbai: తొలి వివాహ వార్షికోత్సవానికి ముందు మహిళ మృతి.. ఏం జరిగిందంటే..!
- మహారాష్ట్రలో మరో దారుణం
- ముంబైలో మహిళ మృతి
- తొలి వివాహ వార్షికోత్సవానికి ముందు మహిళ మృతి
మహారాష్ట్రలో వైద్యురాలి మరణాన్ని మరువక ముందే మరో అబల బలైపోయింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట వేధింపులకు నారీమణులు బలైపోతున్నారు. ముంబైలో తొలి వివాహ వార్షికోత్సవానికి ముందు మహిళ మృతి చెందింది.
ముంబైలోని వెస్ట్ ఖార్కు చెందిన 24 ఏళ్ల నేహా గుప్తా, అరవింద్ గుప్తాకు నవంబర్ 16, 2024న వివాహం జరిగింది. ఇంకో కొద్ది రోజుల్లో తొలి వివాహ వార్షికోత్సవం జరుపుకోవాలి. కానీ ఇంతలోనే శవమైంది. అక్టోబర్ 16న రాత్రి నేహా గుప్తాను అత్తింటి వారు ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటల తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. కానీ వెంటనే కొన్ని గంటల్లోనే రెండోసారి ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ఈసారి చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ఇది కూడా చదవండి: Doctor Death Case: వైద్యురాలి ఆత్మహత్యకు ముందు ఇంత జరిగిందా? వెలుగులోకి డెత్ మిస్టరీ
తొలి వివాహ వార్షికోత్సవం చేసుకోవడానికి సిద్ధపడుతున్న తరుణంలో కుమార్తె మరణవార్త తెలిసి తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. నేహా గుప్తా అంతక ముందే తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి బాగోలేదని.. విషం ఇస్తున్నారని.. భర్త, అతని కుటుంబ సభ్యులు వరకట్నం కోసం వేధిస్తున్నారని వాపోయింది. ఇంతలోనే నేహా గుప్తా చనిపోయినట్లు రావడంతో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది. భర్త, అత్తమామల వేధింపులతో కుమార్తెను చంపేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త, ఐదుగురు కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. నిందితులపై వరకట్న వేధింపులు, విషప్రయోగం, హత్య కింద కేసులు నమోదు చేశారు. ఫోరెన్సిక్, పోస్ట్మార్టం నివేదికలు పెండింగ్లో ఉన్నాయని.. రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అరవింద్ గుప్తా.. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో జన్మించి ముంబైలో బ్యాంకు అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వివాహం జరిగిన కొద్దికాలానికే నేహా గుప్తాపై వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె తండ్రి రాధేశ్యామ్ గుప్తా పోలీసులకు తెలిపారు.
నేహా గుప్తా తండ్రి రాధేశ్యామ్ గుప్తా మాట్లాడుతూ.. తన అల్లుడికి రూ.28 లక్షల విలువైన బంగారం, రూ.9 లక్షల నగదు, గృహోపకరణాలు, బహుమతులు ఇచ్చినట్లు తెలిపాడు. ఖరీదైన బహుమతులను కట్నంగా పరిగణించలేదని.. ఎందుకంటే చట్టవిరుద్ధం కాబట్టి అలాగే ఇవ్వాల్సి వచ్చిందని తెలిపాడు. ఇవన్నీ ఇచ్చినా నిత్యం తమ కుమార్తెను అదనపు కట్నం కోసం వేధించారని వాపోయాడు. ఇంకా డబ్బు, ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్సైకిల్ ఇవ్వాలని కోరినట్లు తెలిపాడు. అందుకు నిరాకరించడంతో వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయాడు. నేహా గుప్తాపై విషప్రయోగం జరిగిందని.. ఆహారంలో మాదకద్రవ్యాలు కలిపి ఉండటం వల్ల పదేపదే మూర్ఛపోయేలా చేశారని పేర్కొన్నాడు. చాలా సార్లు వింతగా, మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు కనిపించిందని వెల్లడించాడు. బలవంతంగా గర్భస్రావం కూడా చేయించారని చెప్పాడు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!