Doctor Death Case: వైద్యురాలి ఆత్మహత్యకు ముందు ఇంత జరిగిందా? వెలుగులోకి డెత్ మిస్టరీ
- వైద్యురాలి ఆత్మహత్యకు ముందు ఇంత జరిగిందా?
- వెలుగులోకి డెత్ మిస్టరీ
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన వైద్యురాలి ఆత్మహత్య కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: Central Cabinet Decisions: బీహార్ ఎన్నికల వేళ అన్నదాతలకు కేంద్రం శుభవార్త
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
వైద్యురాలికి ఇంటి యజమాని కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్తో శారీరిక సంబంధం ఉంది. అయితే ఇంట్లో జరుగుతున్న లక్ష్మీ పూజకు యజమాని ఆహ్వానించాడు. ఈ లక్ష్మీ పూజకు వైద్యురాలు హాజరైంది. అయితే ఫొటోలు తీసుకునే విషయంలో ప్రశాంత్ బంకర్కు వైద్యురాలి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపంతో వైద్యురాలు హోటల్కు వెళ్లిపోయింది. అదే రాత్రి ఫోన్లో ప్రశాంత్ బంకర్తో వాగ్యుద్ధం జరిగింది. అనంతరం హోటల్ గదిలో ఉరివేసుకుని వైద్యురాలు ప్రాణం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Bus Accident: మరో బస్సు ప్రమాదం.. హైటెన్షన్ వైర్ తగిలి బస్సు దగ్ధం
అయితే వైద్యురాలు ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులో ఎస్ఐ గోపాల్ బద్నే, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ లైంగిక వేధింపులు, మానసిక క్షోభతో ప్రాణాలు తీసుకున్నట్లు రాసుకొచ్చింది. అంతేకాకుండా నకిలీ నివేదికలు ఇవ్వాలంటూ పోలీసు అధికారులు ఒత్తిడి చేశారని.. ఒక మాజీ ఎంపీ, అతడి సహచరులు కూడా ఒత్తిడికి గురి చేశారని ఆరోపించింది.
అయితే సంఘటనపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకంకర్ కూడా విచారణ జరిపారు. విచారణ విషయాలను మీడియాకు వెల్లడించారు. ఎస్ఐ గోపాల్ బద్నేతో మార్చి వరకు శారీరిక సంబంధాలు ఉన్నాయని.. ఈ మధ్య కాలంలో ఎలాంటి సంబంధాలు లేనట్లుగా చెప్పారు. ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్తో వైద్యురాలు సంబంధం కొనసాగిస్తోందని వెల్లడించారు. లక్ష్మీ పూజ రోజున ఇద్దరి మధ్య ఫొటోలు సరిగ్గా తీయలేదని ఘర్షణ జరిగిందని.. అనంతరం ఆమె హోటల్కు వెళ్లి ఆత్మహత్య చేసుకుందని వివరించారు. నిందితులిద్దరి ఫోన్ కాల్స్ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. మార్చి నుంచి ఎస్ఐతో ఎలాంటి కమ్యూనికేషన్ జరగలేదని చకంకర్ వెల్లడించారు.
ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సంస్థాగత హత్యగా పేర్కొన్నారు. రక్షించాల్సిన వాళ్లే భక్షించారంటూ ఆరోపించారు.
వైద్యురాలి మృతిపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆరోపించారు. పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేశారని.. కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. మా చెల్లెలికి న్యాయం జరిగే వరకు మేము మౌనంగా కూర్చోమని.. ప్రతి విషయంలోనూ కొంతమంది రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తారని.. ఇది మా చెల్లెలి కేసు … ఎటువంటి రాజీ పడబోమని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!