India-Canada Conflict: కెనడా ప్రధానిలో మొదలైన భయం.. భారత్-కెనడాల మధ్య వాణిజ్య బంధం దెబ్బతింటుందా..?
- భారత్-కెనడాల మధ్య ముదిరిన దౌత్యయుద్ధం..
- వాణిజ్య రంగంపై ప్రభావం పడుతుందా..?
- భారత్ చర్యల్ని ఊహించని కెనడా పీఎం ట్రూడో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Conflict: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ అక్కడ రోజురోజుకు పడిపోతోంది. మరోవైపు ప్రభుత్వంపై కొందరు ఎంపీలు అసమ్మతి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిన్నింటి పక్కకు తప్పించి, మరోసారి సిక్కులు, సిక్కు ఎంపీల మద్దతు పొందేందుకు ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యని ముందుకు తీసుకువచ్చారు. ఈ కేసులో కెనడాలోని భారత అగ్రశ్రేణి దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధం మొదలైంది. భారత్ ఇప్పటికే కెనడాలోని భారత హైకమిషనర్తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. ఇక భారత్లో ఉన్న ఆరుగురు కెనడా దౌత్యవేత్తల్ని శనివారంలోగా దేశం వదిలి వెళ్లాలని కేంద్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
అయితే, ఈ పరిణామాలు ఒకింత కెనడాని ఆశ్చర్యానికి గురిచేసినట్లు తెలుస్తోంది. భారత్ ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఊహించలేదని అక్కడి మీడియా పేర్కొంటోంది. సిక్కు ఓటర్ల మద్దతు పొందాలని ఈ ఎత్తుగడ వేశాడని తెలిసినా.. భారత్ ఇలాంటి చర్యలు తీసుకుంటుందని కెనడా ఊహించలేదని తెలుస్తోంది.
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
అయితే, ఈ పరిణామాలు దౌత్యయుద్ధం నుంచి వాణిజ్య యుద్ధంగా మారుతుందా..? అనే కలవరం కెనడా పీఎం ట్రూడోలో మొదలైంది. ఇరు దేశాల మధ్య పరిణామాల కారణంగా ఆయన టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం -2023లో ఇరు దేశాల మధ్య 8.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో కెనడా నుంచి భారత దిగుమతులు 4.6 బిలియన్లు కాగా, మన దేశం నుంచి కెనడాకు ఎగుమతులు 3.8 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అయితే, ఈ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే భారత్కి పోయేదేం లేదు. వేరే దేశం నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ వంటి మార్కెట్ని కోల్పోవడానికి ఏ దేశం కూడా ఇష్టపడదు.
Read Also: Health: జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఒక్క దానితో సెట్..!
మరోవైపు, , కెనడియన్ పెన్షన్ ఫండ్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలలో పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడిదారులు ఈ పరిణామాలను ఆసక్తిగా చూస్తున్నారు. కెనడా భారతదేశానికి రెమిటెన్స్లలో అగ్రస్థానంలో ఉంది. కెనడా 2020-21 నుండి 2022-23 మధ్య మొత్తం 3.31 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారతదేశంలో 18వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉంది. కెనడా పెట్టుబడుతు భారత ఎఫ్డీఐలలో 0.5 శాతం వాటా కలిగి ఉన్నాయి. మరోవైపు టీసీఎస్, ఆదిత్య బిర్లా గ్రూప్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి భారతీయ కంపెనీలు కెనడాలో కీలకంగా ఉన్నాయి.
కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (CPPIB), కోటక్ మహీంద్రా బ్యాంక్, పేటీఎం, జొమాటోతో సహా అన్ని రంగాలలో భారతీయ సంస్థలలో గణనీయమైన వాటాలను కలిగి ఉంది. 2023 నాటికి, భారతదేశంలో CPPIB పెట్టుబడులు 14.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కెనడా నుంచి భారత్కి వస్తున్న చెల్లింపు గురించి చర్చిస్తే.. 2023లో భారత్కి ప్రపంచవ్యాప్తంగా 125 బిలియన్ డాలర్ల రిమిటెన్స్ వచ్చాయి. కెనడాలోని భారతీయులు భారత్కి డబ్బుల్ని పంపుతూ.. స్థిరమైన చెల్లింపుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నారు. ఈ పరిణామాలు వీటిపై ఎక్కడ ప్రభావం పడుతుందో అనే భయం కెనడాలో మొదలైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ దౌత్యయుద్ధం, వాణిజ్య సంబంధాలపై తక్కువ ప్రభావాన్నే చూపించే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!