Delhi Election Results: బీజేపీ వస్తుందా.. ఆప్ హ్యాట్రిక్ కొడుతుందా..
- దేశవ్యాప్తంగా ఢిల్లీ ఫలితాలపై ఆసక్తి..
- గెలుపుపై బీజేపీ, ఆప్ ధీమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Election Results: దేశవ్యాప్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీ గత వైభవాన్ని సాధిస్తుందా..? లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) హ్యాట్రిక్ కొడుతుందా.? అని చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని సాధించి 26 ఏళ్లు అవుతోంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ గత రెండు సార్లు అధికారాన్ని సాధించింది. ఈసారి మాత్రం విజయం అంత సులువు కాదనే భావన అందరిలో ఉంది.
Read Also: Delhi Election Results 2025 Live Updates: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్ డేట్స్..
Also Read
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
ఇప్పటి వరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అని బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో, 50కి పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే విశ్వాసాన్ని ఆప్ నేత గోపాల్ రాయ్ కూడా చెబుతున్నారు. తాము 50 సీట్లు గెలుస్తామని అన్నారు. మరోవైపు శుక్రవారం కేజ్రీవాల్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ తన ఎమ్మెల్యేలకు రూ. 15 కోట్లతో పాటు మంత్రి పదవుల్ని ఆఫర్ చేస్తోందని ఆప్ ఆరోపించింది. ఆప్ నేతలు చేసిన ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా దర్యాప్తుకు ఆదేశించిన వెంటనే ఏసీబీ రంగంలోకి దిగింది.
ఇదిలా ఉంటే, ఈ రోజు జరగబోయే ఓట్ల లెక్కింపు కోసం అంతా సిద్ధమైంది. దేశ రాజధానిలోని 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ ఓడించి, ఢిల్లీ తన ఆధిపత్యాన్ని ప్రారంభించింది. ఆ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 67 స్థానాలను గెలుచుకుంది. 2020లో ఆ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి 62 సీట్లు గెలుచుకుంది. గత రెండు సార్లు బీజేపీ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించినా, గెలవలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీని గత మూడుసార్లు బీజేపీ క్లీన్ స్వీప్ చేసినప్పటీకీ అసెంబ్లీలో గెలుపుమాత్రం ఆ పార్టీని ఊరిస్తూనే ఉంది. ఈ సారి బీజేపీ తన గెలుపుపై చాలా ధీమాగా ఉంది.
తాజావార్తలు
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!