Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Why The Arrival Of A Pakistani Cargo Ship In Bangladesh Could Mark A Turning Point In The Subcontinents History

Bangladesh-Pakistan: పాక్ నుంచి బంగ్లాదేశ్‌కి కార్గో షిప్..ఎందుకంత ప్రత్యేకం..?

Published Date :November 15, 2024 , 7:47 pm
By Venu Goapl Reddy
  • కరాచీ నుంచి చిట్టగాంగ్‌కి కార్గో షిప్..
  • పాక్-బంగ్లా మధ్య బలపడుతున్న బంధం..
  • 30 లక్షల మంది మరణాలను మరించిన బంగ్లాదేశ్..
Bangladesh-Pakistan: పాక్ నుంచి బంగ్లాదేశ్‌కి కార్గో షిప్..ఎందుకంత ప్రత్యేకం..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bangladesh-Pakistan: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా పదవి కోల్పోయిన తర్వాత పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్ పోర్టుకు ఒక కార్గో షిప్ వెళ్లింది. ఇది పాక్-బంగ్లాల మధ్య తొలి సముద్ర సంబంధంగా పేర్కొనబడుతోంది. ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్ “ద్వైపాక్షిక వాణిజ్యంలో ఒక ప్రధాన అడుగు”గా అభివర్ణించింది, ఈ అభివృద్ధి రెండు దేశాల మధ్య చారిత్రాత్మకంగా బలహీనమైన సంబంధాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.

ఈ ఏడాది ఆగస్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆగస్టు 05న షేక్ హసీనా భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. ఆమె తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ నియమించబడ్డాడు. ఆయన వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. అక్కడి ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది.

Also Read

  • Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
  • Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!

అయితే, 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్( ఇప్పటి బంగ్లాదేశ్) విముక్తి ఉద్యమం సందర్భంగా దాదాపుగా 30 లక్షల మంది బంగ్లా ప్రజల్ని పాక్ ఆర్మీ ఊచకోత కోసింది. ఈ విషాదాన్ని మరిచిపోయిన బంగ్లా ప్రస్తుత పాలకులు, పాకిస్తాన్‌తో సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతున్నారు. పాకిస్తాన్ తన నేరాలకు ఇప్పటి వరకు క్షమాపనలు చెప్పలేదు, విచారం వ్యక్తం చేయలేదు. కొన్ని సందర్భాల్లో బంగ్లా యుద్ధ నేరాలను భారత్ వైపు మళ్లించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. జిన్నా పాకిస్తాన్ కలల్ని భగ్నం చేయడానికే భారత్ కుట్ర చేసిందని ఆరోపించింది.

Read Also: PCC chief Mahesh Goud: పదేళ్ల బీఆర్‌ఎస్‌ – ఏడాది మా పాలనపై చర్చకు సిద్ధం.. పీసీసీ చీఫ్ సవాల్

షేక్ హసీనా హయాంలో భారత్‌కి పూర్తి మద్దతుగా ఉంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఆమె పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలను పెట్టుకోవడానికి ఆసక్తి చూపించలేదు. ఆమె అధికారంలో ఉన్న సమయంలో 1971 యుద్ధ నేరాలకు సహకరించిన వారిని విచారించింది. ఆమె 2010లో యుద్ధ నేరస్తులను విచారించడానికి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ‘‘జమాతే ఇస్లామీ’’ వంటి సంస్థల్ని నిషేధించింది. జమాత్ నాయకుడు అబ్దుల్ క్వాదర్ మొల్లా 344 మంది పౌరుల్ని చంపినందుకు గానూ దోషిగా నిర్ధారించింది. హసీనా పాలనలో ఇతడిని ఉరితీశారు. ఆ సమయంలో పాక్ మంత్రి చౌదరి నిసార్ అలీఖాన్ మాట్లాడుతూ.. మొల్లాని ఉరితీయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు.

1975లో షేక్ హసీనా తండ్రి బంగ్లా జాతిపితగా చెప్పబడే షేక్ ముజిబుర్ రెహ్మన్ హత్య తర్వాత హసీనాకు న్యూఢిల్లీ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం కూడా ఆమె భారత్‌లోనే ఉంది. ఎప్పుడైతే ఆమె అధికారం కోల్పోయిందో, యూనస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ప్రస్తుతం సెక్యులర్ ‌గా ఉన్న బంగ్లాదేశ్, ఇస్లామిక్ రాజ్యం దిశగా అడుగులేస్తోంది. రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలని అక్కడ ప్రభుత్వ పెద్దలే కోరుతున్నారు. యూనస్ ప్రభుత్వం జమాతే ఇస్లామీపై బ్యాన్ ఎత్తేసింది. పలువురు ఉగ్రవాదుల్ని జైళ్ల నుంచి రిలీజ్ చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1971 liberation war
  • Bangladesh
  • Muhammad Yunus
  • Pakistan
  • Sheikh Hasina

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions