Mamata Banerjee: వక్ఫ్ బిల్లు పేరిట ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
- వక్ఫ్ బిల్లులో ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తు్న్నారు..
- హిందువులు, క్రైస్తవుల విషయంలో ఇలా చేసే ధైర్యం ఉందా..
- వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం..
- కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడిన మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: వక్ఫ్(సవరణ) బిల్లుపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సోమవారం స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మడిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకురావడం అనుమానాలకు కారణమవుతుందని ఆరోపించారు. బిల్లును వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీలో ఈ రోజు తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంలో మమత మాట్లాడారు. ఈ బిల్లు విషయంలో కేంద్రం రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని అన్నారు. వక్ఫ్ బిల్లు విషయంలో కేంద్రం తమని సంప్రదించలేదని చెప్పారు.
Read Also: PM Modi: పార్లమెంట్లో ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ చూసిన మోడీ
Also Read
- India-Venezuela: భారత్కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
- Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన
- PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
ఈ బిల్లు విషయమై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చర్చల్లో బీజేపీ ప్రతిపక్ష సభ్యుల నోరు మూయించిందని టీఎంసీ చీఫ్ ఆరోపించారు. జేపీసీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, వారు అందకే బహిష్కరించాలని మమతా బెనర్జీ అన్నారు. ముస్లింలను ఒంటరిగా చేయడం ద్వారా కేంద్రం విభజన ఎజెండాను ముందుకు తెస్తోందని ఆమె ఆరోపించారు.
‘‘”ఈ వక్ఫ్ (సవరణ) బిల్లు పేరుతో ఒకే మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వివిధ హిందూ దేవాలయాల ట్రస్ట్లు లేదా చర్చిల ఆస్తులతో మీరు అదే పని చేయడానికి ధైర్యం చేస్తారా? సమాధానం లేదు. కానీ, నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడం మీ విభజన ఎజెండాకు నిదర్శనం’’ అని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ లేనందున ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదించగలరా..? అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్లో పరిస్థితిపై, పొరుగు దేశంలోని హిందువులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
-
India-Venezuela: భారత్కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
-
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
-
Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన
-
PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!