Sanjay Raut: సీఎం యోగిపై ఒత్తిడి తెచ్చేందుకే ఫడ్నవీస్ రాజీనామా డ్రామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఈ స్థాయిలో ఫలితాలు రావడం ఎవరూ ఊహించి ఉండరు. 48 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ కేవలం 09 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఎన్డీయే కూటమిగా 17 సీట్లను గెలుచుకోగా, ఇండియా కూటమి ఏకంగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఫలితాలకు తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వ పదవులకు రాజీనామా చేసి, పార్టీ బలోపేతానికి పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
Read Also: Hypersonic Missile: మాస్కోను 30 నిమిషాల్లో తాకే హైపర్ సోనిక్ మిస్సైల్ని పరీక్షించిన యూఎస్..
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
అయితే, ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్ స్పందించారు. అతని రాజీనామా ప్రతిపాదన కేవలం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ఒత్తిడి తీసుకురావడానికే అని జాతీయ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కొత్త ఎన్డీయే సర్కార్ ఎక్కువ రోజులు నిలవదని జోస్యం చెప్పారు. ‘‘యోగిపై ఒత్తిడి తెచ్చేందుకు ఫడ్నవీస్ రాజీనామా కుట్ర చేస్తున్నాడు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ నాయకత్వంలో బీజేపీ ఓడిపోతే, ఉత్తరప్రదేశ్లో యోగి నాయకత్వంలో ఓడిపోయింది. అందుకే ఫడ్నవీస్ రాజీనామా గురించి మాట్లాడుతున్నారు’’ అని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ ఫలితాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ దారుణంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీలో చీలికల ప్రభావం బీజేపీపై పడింది. శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీలతో పోలిస్తే శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) మంచి ఫలితాలను సాధించాయి. కాంగ్రెస్ 13 సీట్లను గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్లోని 80 సీట్లలో బీజేపీ కేవలం 33 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఏకంగా 37 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకుంది. రామ మందిర నిర్మాణం, పటిష్టమైన బీజేపీ బలగం ఉన్నప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఆశించినంత ఫలితాలను సాధించలేదు. అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ లోక్సభ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!