New Delhi: విమాన సిబ్బంది నిర్లక్ష్యం.. అంధురాలిని లోపలే వదిలేసిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vistara Flight leaves blind Woman: విమానంలో జరిగే సంఘటనలకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. విమాన సిబ్బంది నిర్లక్ష్యం, వారు చేసే పనులు, దాంట్లో ఉండే అసౌర్యాల గురించి సామాన్యుల దగ్గర నుంచి వీఐపీల వరుకు చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మరోసారి విమాన సిబ్బంది చేసిన ఓ నిర్వాకం బయట పడింది. ఇదొక షాకింగ్ అనుభవంగా పేర్కొంటూ.. ఇన్స్టాగ్రామ్ వేదికగా జరిగిందంతా చెప్పుకొచ్చారు ఓ వ్యక్తి. అంధురాలైన తన తల్లిని విమానంలోనే ఒంటరిగా వదిలేశారంటూ విమానయాన సిబ్బంది తీరుపై మండిపడుతూ జరిగిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Also Read:ISRO Valarmathi: ఇస్రోలో విషాదం.. మూగబోయిన కౌంట్ డౌన్ స్వరం
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
అసలు విషయంలో వస్తే ఆయుష్ కేజ్రీవాల్ అనే వ్యక్తి తల్లి అంధురాలు. ఆయన తన తల్లిని ఆగస్టు 31న దిల్లీ- కోల్కతా విస్తారా విమానం ఎక్కించారు. అయితే ఆమెకు విమాన సిబ్బంది సాయం అవసరం కావడంతో ఆయన టికెట్ కొన్న సమయంలోనే సిబ్బంది హెల్ప్ చేసే విధంగానే ట్రావెల్ ప్లాన్ ను ఎంచుకున్నారు. అంటే ఆమె విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఫ్లై్ట్ సిబ్బంది తోడుగా ఉండాలి. ఆమెను తీసువచ్చి నిర్ధేశిత ప్రదేశంలో అప్పగించాలి. అయితే విమానం కోల్ కతాకు చేరుకున్న తరువాత ప్రయాణీకులందరూ వెళ్లిపోయిన తరువాత కూడా అంధురాలి గురించి ఎవరు పట్టించుకోలేదు. మొదట్లో కొద్దిసేపు వేచి ఉండాలని అంధురాలికి చెప్పిన సిబ్బంది తరువాత ఆమె విషయం మరచిపోయారు. అయితే క్లీనింగ్ సిబ్బంది వచ్చే వరకు ఆమె విమానంలోనే ఉండటంతో వారు ఎయిర్ లైన్స్ వారికి సమాచారం అందించారు. దాంతో వారు ఆమెను బయటకు తీసుకువచ్చారు. దీని గురించి తెలిపిన ఇన్ స్టా గ్రామ్ ఆయుష్ కేజ్రీవాల్ తన తల్లి ప్రాణాలను ఎలా ప్రమాదంలో పడేస్తారని మండిపడ్డారు. టికెట్ తీసుకున్నా మీకు దివ్యాంగ ప్రయాణీకుల సంరక్షణ పట్టదా? వారిని మీరసలు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. ఆయుష్ కు చాలా మంది నెటిజన్లు అండగా నిలబడ్డారు. దీనిపై విమానయాన సంస్థ స్పందిస్తూ.. వారికి జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో అంచనాలను అందుకోలేకపోయినందకు క్షమాపణలు తెలిపింది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!