New Delhi: విమాన సిబ్బంది నిర్లక్ష్యం.. అంధురాలిని లోపలే వదిలేసిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vistara Flight leaves blind Woman: విమానంలో జరిగే సంఘటనలకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. విమాన సిబ్బంది నిర్లక్ష్యం, వారు చేసే పనులు, దాంట్లో ఉండే అసౌర్యాల గురించి సామాన్యుల దగ్గర నుంచి వీఐపీల వరుకు చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మరోసారి విమాన సిబ్బంది చేసిన ఓ నిర్వాకం బయట పడింది. ఇదొక షాకింగ్ అనుభవంగా పేర్కొంటూ.. ఇన్స్టాగ్రామ్ వేదికగా జరిగిందంతా చెప్పుకొచ్చారు ఓ వ్యక్తి. అంధురాలైన తన తల్లిని విమానంలోనే ఒంటరిగా వదిలేశారంటూ విమానయాన సిబ్బంది తీరుపై మండిపడుతూ జరిగిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Also Read:ISRO Valarmathi: ఇస్రోలో విషాదం.. మూగబోయిన కౌంట్ డౌన్ స్వరం
Also Read
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
అసలు విషయంలో వస్తే ఆయుష్ కేజ్రీవాల్ అనే వ్యక్తి తల్లి అంధురాలు. ఆయన తన తల్లిని ఆగస్టు 31న దిల్లీ- కోల్కతా విస్తారా విమానం ఎక్కించారు. అయితే ఆమెకు విమాన సిబ్బంది సాయం అవసరం కావడంతో ఆయన టికెట్ కొన్న సమయంలోనే సిబ్బంది హెల్ప్ చేసే విధంగానే ట్రావెల్ ప్లాన్ ను ఎంచుకున్నారు. అంటే ఆమె విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఫ్లై్ట్ సిబ్బంది తోడుగా ఉండాలి. ఆమెను తీసువచ్చి నిర్ధేశిత ప్రదేశంలో అప్పగించాలి. అయితే విమానం కోల్ కతాకు చేరుకున్న తరువాత ప్రయాణీకులందరూ వెళ్లిపోయిన తరువాత కూడా అంధురాలి గురించి ఎవరు పట్టించుకోలేదు. మొదట్లో కొద్దిసేపు వేచి ఉండాలని అంధురాలికి చెప్పిన సిబ్బంది తరువాత ఆమె విషయం మరచిపోయారు. అయితే క్లీనింగ్ సిబ్బంది వచ్చే వరకు ఆమె విమానంలోనే ఉండటంతో వారు ఎయిర్ లైన్స్ వారికి సమాచారం అందించారు. దాంతో వారు ఆమెను బయటకు తీసుకువచ్చారు. దీని గురించి తెలిపిన ఇన్ స్టా గ్రామ్ ఆయుష్ కేజ్రీవాల్ తన తల్లి ప్రాణాలను ఎలా ప్రమాదంలో పడేస్తారని మండిపడ్డారు. టికెట్ తీసుకున్నా మీకు దివ్యాంగ ప్రయాణీకుల సంరక్షణ పట్టదా? వారిని మీరసలు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. ఆయుష్ కు చాలా మంది నెటిజన్లు అండగా నిలబడ్డారు. దీనిపై విమానయాన సంస్థ స్పందిస్తూ.. వారికి జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో అంచనాలను అందుకోలేకపోయినందకు క్షమాపణలు తెలిపింది.
తాజావార్తలు
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!