New Delhi: విమాన సిబ్బంది నిర్లక్ష్యం.. అంధురాలిని లోపలే వదిలేసిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vistara Flight leaves blind Woman: విమానంలో జరిగే సంఘటనలకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. విమాన సిబ్బంది నిర్లక్ష్యం, వారు చేసే పనులు, దాంట్లో ఉండే అసౌర్యాల గురించి సామాన్యుల దగ్గర నుంచి వీఐపీల వరుకు చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మరోసారి విమాన సిబ్బంది చేసిన ఓ నిర్వాకం బయట పడింది. ఇదొక షాకింగ్ అనుభవంగా పేర్కొంటూ.. ఇన్స్టాగ్రామ్ వేదికగా జరిగిందంతా చెప్పుకొచ్చారు ఓ వ్యక్తి. అంధురాలైన తన తల్లిని విమానంలోనే ఒంటరిగా వదిలేశారంటూ విమానయాన సిబ్బంది తీరుపై మండిపడుతూ జరిగిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Also Read:ISRO Valarmathi: ఇస్రోలో విషాదం.. మూగబోయిన కౌంట్ డౌన్ స్వరం
Also Read
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
- CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
అసలు విషయంలో వస్తే ఆయుష్ కేజ్రీవాల్ అనే వ్యక్తి తల్లి అంధురాలు. ఆయన తన తల్లిని ఆగస్టు 31న దిల్లీ- కోల్కతా విస్తారా విమానం ఎక్కించారు. అయితే ఆమెకు విమాన సిబ్బంది సాయం అవసరం కావడంతో ఆయన టికెట్ కొన్న సమయంలోనే సిబ్బంది హెల్ప్ చేసే విధంగానే ట్రావెల్ ప్లాన్ ను ఎంచుకున్నారు. అంటే ఆమె విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఫ్లై్ట్ సిబ్బంది తోడుగా ఉండాలి. ఆమెను తీసువచ్చి నిర్ధేశిత ప్రదేశంలో అప్పగించాలి. అయితే విమానం కోల్ కతాకు చేరుకున్న తరువాత ప్రయాణీకులందరూ వెళ్లిపోయిన తరువాత కూడా అంధురాలి గురించి ఎవరు పట్టించుకోలేదు. మొదట్లో కొద్దిసేపు వేచి ఉండాలని అంధురాలికి చెప్పిన సిబ్బంది తరువాత ఆమె విషయం మరచిపోయారు. అయితే క్లీనింగ్ సిబ్బంది వచ్చే వరకు ఆమె విమానంలోనే ఉండటంతో వారు ఎయిర్ లైన్స్ వారికి సమాచారం అందించారు. దాంతో వారు ఆమెను బయటకు తీసుకువచ్చారు. దీని గురించి తెలిపిన ఇన్ స్టా గ్రామ్ ఆయుష్ కేజ్రీవాల్ తన తల్లి ప్రాణాలను ఎలా ప్రమాదంలో పడేస్తారని మండిపడ్డారు. టికెట్ తీసుకున్నా మీకు దివ్యాంగ ప్రయాణీకుల సంరక్షణ పట్టదా? వారిని మీరసలు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. ఆయుష్ కు చాలా మంది నెటిజన్లు అండగా నిలబడ్డారు. దీనిపై విమానయాన సంస్థ స్పందిస్తూ.. వారికి జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో అంచనాలను అందుకోలేకపోయినందకు క్షమాపణలు తెలిపింది.
తాజావార్తలు
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
-
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
-
AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..