New Delhi: విమాన సిబ్బంది నిర్లక్ష్యం.. అంధురాలిని లోపలే వదిలేసిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vistara Flight leaves blind Woman: విమానంలో జరిగే సంఘటనలకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. విమాన సిబ్బంది నిర్లక్ష్యం, వారు చేసే పనులు, దాంట్లో ఉండే అసౌర్యాల గురించి సామాన్యుల దగ్గర నుంచి వీఐపీల వరుకు చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మరోసారి విమాన సిబ్బంది చేసిన ఓ నిర్వాకం బయట పడింది. ఇదొక షాకింగ్ అనుభవంగా పేర్కొంటూ.. ఇన్స్టాగ్రామ్ వేదికగా జరిగిందంతా చెప్పుకొచ్చారు ఓ వ్యక్తి. అంధురాలైన తన తల్లిని విమానంలోనే ఒంటరిగా వదిలేశారంటూ విమానయాన సిబ్బంది తీరుపై మండిపడుతూ జరిగిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Also Read:ISRO Valarmathi: ఇస్రోలో విషాదం.. మూగబోయిన కౌంట్ డౌన్ స్వరం
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
అసలు విషయంలో వస్తే ఆయుష్ కేజ్రీవాల్ అనే వ్యక్తి తల్లి అంధురాలు. ఆయన తన తల్లిని ఆగస్టు 31న దిల్లీ- కోల్కతా విస్తారా విమానం ఎక్కించారు. అయితే ఆమెకు విమాన సిబ్బంది సాయం అవసరం కావడంతో ఆయన టికెట్ కొన్న సమయంలోనే సిబ్బంది హెల్ప్ చేసే విధంగానే ట్రావెల్ ప్లాన్ ను ఎంచుకున్నారు. అంటే ఆమె విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఫ్లై్ట్ సిబ్బంది తోడుగా ఉండాలి. ఆమెను తీసువచ్చి నిర్ధేశిత ప్రదేశంలో అప్పగించాలి. అయితే విమానం కోల్ కతాకు చేరుకున్న తరువాత ప్రయాణీకులందరూ వెళ్లిపోయిన తరువాత కూడా అంధురాలి గురించి ఎవరు పట్టించుకోలేదు. మొదట్లో కొద్దిసేపు వేచి ఉండాలని అంధురాలికి చెప్పిన సిబ్బంది తరువాత ఆమె విషయం మరచిపోయారు. అయితే క్లీనింగ్ సిబ్బంది వచ్చే వరకు ఆమె విమానంలోనే ఉండటంతో వారు ఎయిర్ లైన్స్ వారికి సమాచారం అందించారు. దాంతో వారు ఆమెను బయటకు తీసుకువచ్చారు. దీని గురించి తెలిపిన ఇన్ స్టా గ్రామ్ ఆయుష్ కేజ్రీవాల్ తన తల్లి ప్రాణాలను ఎలా ప్రమాదంలో పడేస్తారని మండిపడ్డారు. టికెట్ తీసుకున్నా మీకు దివ్యాంగ ప్రయాణీకుల సంరక్షణ పట్టదా? వారిని మీరసలు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. ఆయుష్ కు చాలా మంది నెటిజన్లు అండగా నిలబడ్డారు. దీనిపై విమానయాన సంస్థ స్పందిస్తూ.. వారికి జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో అంచనాలను అందుకోలేకపోయినందకు క్షమాపణలు తెలిపింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?