Mamata Banerjee: ఇందిరాగాంధీ చంద్రుడి పైకి వెళ్లిందట.. దీదీ విచిత్ర ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విచిత్రమైన ప్రకటన చేశారు. భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ చంద్రుడిపైకి వెళ్లారని తప్పుగా పేర్కొనడంతో నవ్వులపాలయ్యారు. దీనికి ముందు భారతదేశం తరుపున మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి ‘రాకేష్ శర్మ’ పేరును ‘రాకేష్ రోషన్’గా పేర్కొన్నారు. నిజానికి రాకేష్ రోషన్ బాలీవుడ్ సినీ నిర్మాత.
చంద్రయాన్-3 విజయవంతం అయినందున ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ఇందిరాగాంధీపై ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ ఛత్ర పరిషత్ (టీఎంసీపీ) వ్యవస్థాపక దినోత్సవం, 2023 సందర్భంగా జరిగిన ర్యాలీలో ఆమె సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఇందిరా గాంధీ చంద్రుడిపైకి చేరుకున్నప్పుడు, అక్కడి నుంచి హిందూస్థాన్(భారత్) ఎలా కనిపిస్తుందని ఆమె రాకేష్ను అడిగారు. అతను ‘సారే జహాన్ సే అచ్చా’( ప్రపంచంలోనే అత్యుత్తమైంది)గా కనిపిస్తుందని జవాబు ఇచ్చారని దీదీ వ్యాఖ్యానించారు.
Also Read
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
Read Also: Ola S1X Bookings: ఓలా ఎస్1 ఈవీ స్కూటర్ల రేంజ్ మామూలుగా లేదు.. 15 రోజుల్లో 75000 పైగా బుకింగ్స్!
చంద్రయాన్-3 విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రేవత్తలను అభినందిస్తూ.. రాకేష్ శర్మను, రాకేష్ రోషన్ గా సంబోధించి మమతా బెనర్జీ విమర్శల పాలయ్యారు. ఆగస్టు 23న చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ని చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఈ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనాల తరువాత నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ముఖ్యంగా దక్షిణ ధృవాన్ని చేరుకకున్న మొదటి దేశంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపై తిరుగుతూ అక్కడి పరీక్షలు నిర్వహిస్తోంది.
తాజావార్తలు
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!