Manmohan Singh: నేను ‘మౌన ప్రధానిని’ కాదు.. విపక్షాలకు గట్టి సమాధానం ఇచ్చిన మన్మోహన్ సింగ్
- ప్రెస్తో మాట్లాడడానికి భయపడిన ప్రధానిని కాదు: మన్మోహన్
- విదేశీ పర్యటనల సమయంలో మీడియాతో మాట్లాడనంటూ 2018లో వెల్లడి..
- ఛేంజింగ్ ఇండియా అనే పుస్తకావిష్కరణలో మన్మోహన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. వరుసగా పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా చిరస్మరణీయ సేవలు అందజేశారు. అయితే, ఆయన పదవిలో కొనసాగినంత కాలం మౌనముని, మౌన ప్రధాని అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా దేశాభివృద్ధిలో ఆయన తనదైన ముద్రను వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలోనే ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకోగా.. పదవి నుంచి దిగిపోయిన నాలుగేళ్ల (2018) తర్వాత తొలిసారి మౌనముని విమర్శలపై రియాక్ట్ అయ్యాడు. ఆయన రచించిన ‘ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకావిష్కరణలో మాట్లాడుతూ.. నన్ను మౌన ప్రధాని అని ఎద్దేవా చేసిన వారు.. వాస్తవాలు ఏమిటో ఈ పుస్తకాలు తెలియజేస్తాయని చెప్పుకొచ్చారు.
Read Also: PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నరేంద్ర మోడీ నివాళి..
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఇక, మీడియాతో మాట్లాడటానికి భయపడిన ప్రధాన మంత్రిని కాదు.. నేను క్రమం తప్పకుండా ప్రెస్ తో మాట్లాడాను అని మన్మోహన్ సింగ్ తెలియజేశారు. నేను చేపట్టిన ప్రతి విదేశీ పర్యటన సమయంలో మీడియా సమావేశం నిర్వహించాను అని వెల్లడించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్లలో పాల్గొన్నాను.. వాటి ఫలితాలను కూడా ఛేంజింగ్ ఇండియా అనే పుస్తకంలో రాసుకొచ్చాను అని మన్మోహన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Read Also: Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్లో తులం బంగారం ఎంతంటే?
అయితే, 2004 నుంచి 2014 వరకు యూపీఏ సర్కార్ లో 10 సంవత్సరాల కాలం పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా విధులు నిర్వహించారు. అలాగే, అంతకుముందు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చిరస్మరణీయ సేవలను ఆయన అందించారు. ఇక, 1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రపంచ మార్కెట్లో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక భాగంగా మార్చాడు. దీంతో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటంతో పాటు వృద్ధిలోకి వచ్చింది. అందుకే ఆధునిక భారతదేశ ఆర్థిక రూపశిల్పిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజావార్తలు
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!