Manmohan Singh: నేను ‘మౌన ప్రధానిని’ కాదు.. విపక్షాలకు గట్టి సమాధానం ఇచ్చిన మన్మోహన్ సింగ్
- ప్రెస్తో మాట్లాడడానికి భయపడిన ప్రధానిని కాదు: మన్మోహన్
- విదేశీ పర్యటనల సమయంలో మీడియాతో మాట్లాడనంటూ 2018లో వెల్లడి..
- ఛేంజింగ్ ఇండియా అనే పుస్తకావిష్కరణలో మన్మోహన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. వరుసగా పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా చిరస్మరణీయ సేవలు అందజేశారు. అయితే, ఆయన పదవిలో కొనసాగినంత కాలం మౌనముని, మౌన ప్రధాని అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా దేశాభివృద్ధిలో ఆయన తనదైన ముద్రను వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలోనే ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకోగా.. పదవి నుంచి దిగిపోయిన నాలుగేళ్ల (2018) తర్వాత తొలిసారి మౌనముని విమర్శలపై రియాక్ట్ అయ్యాడు. ఆయన రచించిన ‘ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకావిష్కరణలో మాట్లాడుతూ.. నన్ను మౌన ప్రధాని అని ఎద్దేవా చేసిన వారు.. వాస్తవాలు ఏమిటో ఈ పుస్తకాలు తెలియజేస్తాయని చెప్పుకొచ్చారు.
Read Also: PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నరేంద్ర మోడీ నివాళి..
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
ఇక, మీడియాతో మాట్లాడటానికి భయపడిన ప్రధాన మంత్రిని కాదు.. నేను క్రమం తప్పకుండా ప్రెస్ తో మాట్లాడాను అని మన్మోహన్ సింగ్ తెలియజేశారు. నేను చేపట్టిన ప్రతి విదేశీ పర్యటన సమయంలో మీడియా సమావేశం నిర్వహించాను అని వెల్లడించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్లలో పాల్గొన్నాను.. వాటి ఫలితాలను కూడా ఛేంజింగ్ ఇండియా అనే పుస్తకంలో రాసుకొచ్చాను అని మన్మోహన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Read Also: Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్లో తులం బంగారం ఎంతంటే?
అయితే, 2004 నుంచి 2014 వరకు యూపీఏ సర్కార్ లో 10 సంవత్సరాల కాలం పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా విధులు నిర్వహించారు. అలాగే, అంతకుముందు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చిరస్మరణీయ సేవలను ఆయన అందించారు. ఇక, 1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రపంచ మార్కెట్లో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక భాగంగా మార్చాడు. దీంతో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటంతో పాటు వృద్ధిలోకి వచ్చింది. అందుకే ఆధునిక భారతదేశ ఆర్థిక రూపశిల్పిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజావార్తలు
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
-
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!