West Bengal: రణరంగంగా బెంగాల్.. మమతాబెనర్జీ “లేడీ కిమ్” అంటూ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nabanna Abhiyan march in west bengal: పశ్బిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. 2021 ఎన్నికల తర్వాత బీజేపీ మంగళవారం ‘నబన్న అభియాన్’ పేరుతో పెద్ద ఎత్తున సెక్రటేరియట్ మార్చ్ కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు కోల్కతా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు ఎక్కడికక్కడ వీరిని అడ్డుకున్నారు. అనేక జిల్లాల్లో వేలాది మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేందు అధికారి, లాకెట్ ఛటర్జీ, తాప్షి మోండోల్, దిబాంకర్ ఘరామిలతో సహా చాలా మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత బీజేపీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయడం ఇదే మొదటిసారి. కోల్కతాలో నిరసన, ర్యాలీ చేపడుతున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్ ఉపయోగించి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. నిరసన కార్యక్రమాన్ని అణచివేసేందుకు లాఠీఛార్జ్ చేశారు. హల్దియా, నందిగ్రామ్ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. సెక్రరేటియట్ వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు అధికారులు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Nikhil: మొన్న తారక్.. నేడు నిఖిల్.. అమిత్ షా వ్యూహం అదే..?
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. లేడీ కిమ్ లాగా వ్యవహరిస్తున్నారని.. బెంగాల్ రాష్ట్రంలో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేత సువేందు అధికారి విమర్శించారు. ఉత్తర్ కొరియాలాగే.. బెంగాల్ రాష్ట్రాన్ని మమతా బెనర్జీ పాలిస్తున్నారంటూ విమర్శంచారు. సీఎం మమతా బెనర్జీకి ప్రజల మద్దతు లేదని.. నిన్నటి నుంచి పోలీసులు చేస్తున్న దాడికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాలల్ లోని పలు జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు రైళ్లలో రాజధాని కోల్కతాకు చేరుకుంటున్నారు. ప్రజా తిరుగుబాటుకు టీఎంసీ ప్రభుత్వం భయపడుతోందని.. వారు మా ప్రదర్శనను ఆపడానికి ప్రయత్నించినా.. మేము శాంతియుతంగానే ప్రతిఘటిస్తామని.. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!