Nitin Gadkari: రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్గా తీసుకోరు..
- రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్గా తీసుకోరు..
- మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతిదే అధికారం..
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్గా తీసుకోవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం అన్నారు. నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై విశ్వాసం ఉంచుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని, ఆయన మాటల్ని ఎవరూ సీరియస్గా తీసుకోరని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లా మెమోరీ లాస్తో బాధపడుతున్నారు’’ అని ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై.. రాహుల్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గందరగోళానికి దారితీశాయని, దీంతోనే మహారాష్ట్రలో అనుకున్న స్థాయిలో ఎన్డీయే ప్రదర్శన చేయలేకపోయిందని చెప్పారు. ‘‘మేము 400 సీట్లు గెలిస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరిస్తామని తప్పుడు కథనాలనున ప్రచారం చేశారు’’ అని దుయ్యబట్టారు.
Also Read
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
Read Also: Tirupati: తిరుపతిలోని శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ పేరు మార్చిన అఫ్కాన్ సంస్థ
రాజ్యాంగాన్ని మార్చే ప్రశ్నే లేదని, బీజేపీ అలా ఎప్పటికీ చేయదని, లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేసిన ప్రచారం తప్పు అని ఇప్పుడు ప్రజలు గ్రహించారని, ప్రధాని మోడీ నాయకత్వంలోని మహాయుతికి మహారాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని గడ్కరీ అన్నారు. యోగి ‘‘ బాటేంగే తో కటేంగే’’ గురించి మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. మనమంతా ఒక్కటే.. కొందరు గుడికి, మరికొందరు మసీదు, గురుద్వారాలకు వెళ్తారు. కానీ మనమందరం భారతీయులం, దేశం మనకు అన్నింటికంటే ముఖ్యం ” అని అన్నారు.
రాహుల్ గాంధీ లేవనెత్తిన కులగణన గురించి ప్రస్తావిస్తూ.. అసలు సమస్య గ్రామాలు, పేదలు, రైతుల సంక్షేమమేనని, పేదలకు కులం, మతం ఉండవని, ముస్లింలకు ఇతరులతో సమానంగా పెట్రోల్ లభిస్తుందని గడ్కరీ అన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా తాను ఇంతకుముందు పనిచేశానని, ఇప్పుడు ఆ పదవిపై కోరిక లేదని గడ్కరీ చెప్పారు.
తాజావార్తలు
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!