Nitin Gadkari: రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్గా తీసుకోరు..
- రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్గా తీసుకోరు..
- మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతిదే అధికారం..
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కామెంట్స్..
Nitin Gadkari: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్గా తీసుకోవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం అన్నారు. నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై విశ్వాసం ఉంచుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని, ఆయన మాటల్ని ఎవరూ సీరియస్గా తీసుకోరని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లా మెమోరీ లాస్తో బాధపడుతున్నారు’’ అని ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై.. రాహుల్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గందరగోళానికి దారితీశాయని, దీంతోనే మహారాష్ట్రలో అనుకున్న స్థాయిలో ఎన్డీయే ప్రదర్శన చేయలేకపోయిందని చెప్పారు. ‘‘మేము 400 సీట్లు గెలిస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరిస్తామని తప్పుడు కథనాలనున ప్రచారం చేశారు’’ అని దుయ్యబట్టారు.
Also Read
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
- Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
Read Also: Tirupati: తిరుపతిలోని శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ పేరు మార్చిన అఫ్కాన్ సంస్థ
రాజ్యాంగాన్ని మార్చే ప్రశ్నే లేదని, బీజేపీ అలా ఎప్పటికీ చేయదని, లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేసిన ప్రచారం తప్పు అని ఇప్పుడు ప్రజలు గ్రహించారని, ప్రధాని మోడీ నాయకత్వంలోని మహాయుతికి మహారాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని గడ్కరీ అన్నారు. యోగి ‘‘ బాటేంగే తో కటేంగే’’ గురించి మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. మనమంతా ఒక్కటే.. కొందరు గుడికి, మరికొందరు మసీదు, గురుద్వారాలకు వెళ్తారు. కానీ మనమందరం భారతీయులం, దేశం మనకు అన్నింటికంటే ముఖ్యం ” అని అన్నారు.
రాహుల్ గాంధీ లేవనెత్తిన కులగణన గురించి ప్రస్తావిస్తూ.. అసలు సమస్య గ్రామాలు, పేదలు, రైతుల సంక్షేమమేనని, పేదలకు కులం, మతం ఉండవని, ముస్లింలకు ఇతరులతో సమానంగా పెట్రోల్ లభిస్తుందని గడ్కరీ అన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా తాను ఇంతకుముందు పనిచేశానని, ఇప్పుడు ఆ పదవిపై కోరిక లేదని గడ్కరీ చెప్పారు.
తాజావార్తలు
-
Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
-
TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
-
Cigarette Price Hike: సిగరెట్ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?