Waqf Bill: వక్ఫ్ బిల్లు ఉత్కంఠ.. సభలో బీజేపీ సంఖ్యా బలం, ఏ పార్టీ ఎటు వైపు..?
- పార్లమెంట్ ముందుకు నేడు వక్ఫ్ బిల్లు..
- వ్యూహాలు రచిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు..
- రెండు సభల్లో ఎన్డీయేకు బలం..
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ సవరణ బిల్లును ఈ రోజు ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ముందుగా లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ సహా కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేశాయి. మూడు రోజుల పాటు సభకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించాయి. నిన్న సాయంత్రం వక్ఫ్ బిల్లుపై ఇండియా కూటమి పార్టీలు సమావేశాన్ని నిర్వహించాయి. బిల్లుపై చర్చలో పాల్గొంటామని, అయితే బిల్లుకు మాత్రం మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశాయి. ఈ బిల్లుపై చర్చించడానికి రెండు సభలకు 8 గంటలు కేటాయించినట్లు తెలుస్తోంది.
బీజేపీ ఎన్డీయే మిత్ర పక్షాలపై జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) మరియు తెలుగుదేశం పార్టీ (టిడిపి) వంటి కీలక మిత్రుల మద్దతుపై నమ్మకంతో ఉంది. ఇప్పటికే టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) వంటి పార్టీల నాయకులు బిల్లు ఆమోదాన్ని అడ్డుకోబోమని ధృవీకరించారు. బిల్లు వల్ల ముస్లింల హక్కులు తగ్గుతాయని ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపారేశాయి. ఇక షిండే నేతృత్వంలోని శివసేన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఇప్పటికే వారి ఎంపీలకు విప్ జారీ చేసింది. జనసేన కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిజేస్తోంది.
Also Read
- Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
మరోవైపు, వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ సహా వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ, ఆర్ఎస్పీ, ఎంఐఎం వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిల్లును అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. నిన్న జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మరియు కెసి వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుప్రియా సులే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణ్ బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
Read Also: LSG vs PBKS: దంచికొట్టిన ప్రభ్ సిమ్రాన్.. లక్నోపై పంజాబ్ విజయం
పార్లమెంట్లో బలాబలాలు:
లోక్సభ: లోక్సభలో బిల్లు ఆమోదం పొందాలంటే బీజేపీకి 272 ఓట్ల సాధారణ మెజారిటీ అవసరం. 542 మంది ఎంపీలలో 240 మంది బీజేపీ ఎంపీలు, 12 మంది జేడీయూ, 16 మంది టీడీపీ, ఐదుగురు ఎల్జేపీ(ఆర్వి) నుంచి ఇద్దరు ఆర్ఎల్డీ, శివసేనకు చెందిన 07 మంది ఎంపీలు ఉన్నారు. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు.
రాజ్యసభ: రాజ్యసభలో ఎన్డీయేకు 125 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీకి నుంచి 98, జేడీయూ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ముగ్గురు, శివసేన నుంచి ఒకరు, ఆర్ఎల్డీ నుంచి ఒకరు ఉన్నారు. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో బిల్లుకు 119 మంది ఎంపీల మద్దతు అవసరం. అసోం గణ పరిషత్, తమిళ మన్నిలా కాంగ్రెస్ వంటి పార్టీలతో పాటు ఆరుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతు కూడా ఉంటుందని బీజేపీ భావిస్తోంది.
తాజావార్తలు
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
-
Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
-
Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!