Bandi Sanjay : కేంద్రం డబ్బులు వాడుకొని తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయించాలంటూ కూకట్పల్లి మూసాపేటలో బీజేపీ నాయకుల 24 గంటల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. అయితే.. ఈ ఆత్మగౌరవ దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ యోజన పథకం కింద వచ్చిన డబ్బులు వాడుకొని డబల్ బెడ్ రూమ్ లు నిర్మించకుండా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.. తెలంగాణలో బీఆర్ఎస్ వైఫల్యాలను, మోసాలను లేవనెత్తుతున్నారనే భయంతో బీజేపీ నాయకుల పై కేసులు పెడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా బీజేపీ నాయకులను అడ్డుకోలేరని, భయపెట్టలేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read : Naga Shaurya: ‘రంగబలి’ రిలీజ్ డేట్ లాక్ చేశారుగా!
Also Read
- E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
- Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
ధర్మం కోసం బీజేపీ నాయకులు నిరంతరం ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉంటారని బండి సంజయ్ గుర్తు చేశారు. డబల్ బెడ్ రూమ్ ల విషయమై ఎన్నిసార్లు కేంద్రం జాబితా ఇవ్వాలని కోరిన కేసీఆర్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ.. నిరుపేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు బండి సంజయ్. కేంద్రం నిధులతో డబల్ బెడ్రూంలు నిర్మించి ఉంటే ధైర్యంగా జాబితాను కేంద్రానికి ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో ప్రజలు ఓటు బ్యాంకుతో కేసీఆర్కు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో కూకట్పల్లి బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Also Read : CM YS Jagan: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష..
తాజావార్తలు
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో